CI: డ్రగ్స్ డీలర్స్ తో పోలీసు అధికారుల డీలింగ్, ఫోటోలు తీసి కేసు పెట్టిన ఆ లీడర్స్, అర్థం అయ్యిందా !
బెంగళూరు/ బెళగావి: గంజాయి కేసులో నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పంపించారని తిలకవాడి సీఐ దయానంద్ శేగుణసిపై శ్రీరామ్సేన హిందుస్థాన్ సంస్థ అధ్యక్షుడు రమాకాంత కొండుస్కర్ తీవ్ర ఆరోపణ చేశారు. ఈ విషయమై కర్ణాటకలోని బెళగావి సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.బి. బోరలింగయ్యకు ఫిర్యాదు చేసి నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు.
అర్ధరాత్రి బెళగావిలోని ఆర్పిడి సర్కిల్లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకుని తిలకవాడి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారని రమాకాంత కొండుస్కర్ ఆరోపించారు. గంజాయి విక్రయిస్తుండగా ఇద్దరు నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని తిలకవాడి పోలీస్స్టేషన్కు తరలించిన పోలీసులు తరువాత ఆ నిందితుల ఫొటోలు, గంజాయి ఫోటోలు తీసి గంజాయి స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

నిందితుల నుంచి డబ్బులు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని శ్రీరామసేన నాయకులు ఆరోపించారు. అంతే కాకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండానే సీపీఐ ఇద్దరు పోలీసు సిబ్బంది నిందితుల నుంచి లంచం తీసుకుని వారిని వదిలేశారని శ్రీరామసేన నాయకులు ఆరోపిస్తున్నారు. గంజాయిని నిందితులకు ఇచ్చి పొలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపిచేశారని ఆరోపణలు ఉన్నాయి.
బెళగావి సిటీ పోలీస్ కమిషనర్కు వినతిపత్రం అందించిన అనంతరం మీడియాతో స్పందించిన రమాకాంత కొండుస్కర్ పోలీసులు దాడి చేసినప్పుడు కనీసం మూడు నుంచి నాలుగు కేజీల గంజాయి దొరికింది. అనంతరం పట్టుకున్న గంజాయితో పాటు ఇద్దరు నిందితులను తిలకవాడి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా వారి దగ్గర డబ్బు తీసుకుని వదిలేశారని ఆరోపణలు చేశారు.
బెళగావి నగర పోలీసు కమిషనర్తో జరిగిన సమావేశంలో ఇలాంటి అధికారుల వల్ల పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తోందని, కొందరు రాజకీయ నాయకుల అండతోనే ఇలా పోలీసు అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఏడీజీపీ అలోక్ కుమార్ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఈ కేసులో పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది పాత్రపై దర్యాప్తు చేస్తామని ట్వీట్ చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications