Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉగాది నాడే.. పట్టాలు తప్పిన బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

Bengaluru-Kamakhya Superfast Express derailed: మరో రైలు ప్రమాదం సంభవించింది. ఉగాది వేడుకలు, ఛైత్ర నవరాత్రి ఉత్సవాల్లో దేశం మొత్తం మునిగివున్న వేళ.. ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు- కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాలు తప్పాయి. భూమిలోకి కూరకుపోయాయి. పట్టాలపై ఒరిగిపోయాయి.

ఒడిశాలో కొద్దిసేపటి కిందటే ఈ ఉదయం 11:45 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం సంభివించింది. ఈస్ట్ కోస్ట్ జోన్ ఖుర్దా రోడ్ డివిజన్ పరిధిలోని నెర్గుండి స్టేషన్ సమీపంలో ఈ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరికీ ప్రాణాపాయం సంభవించలేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు.

Bengaluru-Kamakhya Superfast Express derailed in Odisha

25 మందికి గాయాలు..

ఈ ఘటనలో ఇప్పటివరకు 25 మంది ప్రయాణికులు గాయపడినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ సమాచారం అందిన వెంటనే ఈస్ట్ కోస్ట్ జోన్ రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

దాదాపుగా 54 గంటల ప్రయాణం..

బెంగళూరు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి శనివారం ఉదయం 8:50 నిమిషాలకు బయలుదేరిన 12551 నంబర్ సూపర్ ఫాస్ట్ ఏసీ ఎక్స్‌ప్రెస్ మూడో రోజు మధ్యాహ్నం 2:25 నిమిషాలకు అస్సాంలోని కామాఖ్యకు చేరుకోవాల్సి ఉంది. దాదాపుగా 54 గంటల పాటు ప్రయాణిస్తుందీ ఎక్స్‌ప్రెస్.

నెర్గుండి- మంగూలి చౌదార్ మధ్య..

మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. ఈస్ట్ కోస్ట్ జోన్ ఖుర్దా రోడ్ డివిజన్ పరిధిలోని నెర్గుండి స్టేషన్ దాటిన కొద్దిసేపటికి మంగూలి చౌదార్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 11 బోగీలు భూమిలోకి కూరుకుపోయాయి. పెద్ద శబ్దం చేస్తూ ఆయా బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. దీనితో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. లగేజీతో బయటికి పరుగులు తీశారు.

యుద్ధ ప్రాతిపదికన..

ఈ సమాచారం అందిన వెంటనే ఈస్ట్ కోస్ట్ జోన్ రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అంబులెన్సులను తెప్పించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి మరో రైలును అందుబాటులోకి తెచ్చారు.

హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు..

ఈ ప్రమాదం నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు పలు స్టేషన్‌లల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. వీటి నంబర్లు భువనేశ్వర్ - 8455885999, 8114382371, కటక్ - 8991124238, 7205149591, ఖుర్దా రోడ్ - 06742492245, భద్రక్- 9437443469, పలాస- 9237105480, జాజ్‌పూర్ కియోంజర్ రోడ్- 9124639558.

స్పందించిన హిమంత..

ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోన్నామని అన్నారు. సహాయక చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చూడాలని అన్నారు.

రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం..

ఈ ప్రమాదం వల్ల ఈ మార్గంలో రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను దారి మళ్లించారు. కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేవారు. కొన్ని చోట్ల పట్టాలు ధ్వంసమైనట్లు గుర్తించారు. వాటిని పునరుద్ధరించిన తరువాతే రైళ్ల రాకపోకలకు అనుమతి ఇస్తామని ఈస్ట్ కోస్ట్ అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+