Bengaluru: కొత్త గవర్నర్ తో రాజకీయాలు మారిపోతాయా ? పొలిటికల్ పంచ్, గతంలో బీజేపీ ఇన్ చార్జ్ !
బెంగళూరు: కర్ణాటక గవర్నర్ గా కేంద్ర మంత్రి తవార్ చంద్ గెహ్లెట్ ను నియమకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. కేంద్ర మంత్రిగా పని చేస్తున్న తవార్ చంద్ గెహ్లెట్ ను కర్ణాటక గవర్నర్ గా నియమించడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇంతకాలంలో కర్ణాటక గవర్నర్ గా వజుభాయ్ వాలా పదవి కాలం పూర్తి అయినా ఇంత వరకు ఆయనే కొనసాగారు. కర్ణాటకకు కొత్త గవర్నర్ గా తవార్ చంద్ గెహ్లెట్ రావడంతో అక్కడి రాజకీయాలు రంగు మారిపోయే అవకాశం ఉందని సమాచారం. గతంలో కర్ణాటక బీజేపీ ఇన్ చార్జ్ గా పని చేసిన తవార్ చంద్ గెహ్లెట్ ఇప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ గా నియమితులు అయ్యారు.

కాలం గడిచిపోయింది
రాష్ట్ర గవర్నర్ గా ఎవరికైనా ఐదు సంవత్సరాలు అవకాశం ఉంటుంది. కర్ణాటక గవర్నర్ గా వాజుభాయ్ వాలా నియమితులై దాదాపుగా ఏడు సంవత్సరాలు కావస్తోంది. 2014 సెప్టెంబర్ 1వ తేదీన గుజరాత్ కు చెందిన వాజుభాయ్ కర్ణాటక గవర్నర్ గా నియమితులైనారు. 2019కే వాజుభాయ్ వాలా పదవి కాలం పూర్తి అయిపోయినా ఆయన ఆస్థానంలోనే కొనసాగుతున్నారు. కర్ణాటకకు కొత్త గవర్నర్ ఎవ్వరూ రాకపోవడంతో ఇంతకాలం వాజూభాయ్ వాలానే గవర్నర్ గా కొనసాగారు.

కర్ణాటక చరిత్రలో ఇదో రికార్డు
ఏ రాష్ట్రానికి అయినా గవర్నర్ గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వ్యక్తి స్థానంలో కొత్త గవర్నర్ ను నియమించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో కర్ణాటకలో ఆరు సంవత్సరాలకు పైగా పని చేసిన గవర్నర్లు ఉన్నారు. కర్ణాటక గవర్నర్ గా ఖుర్షీద్ అలం ఖాన్ 7 సంవత్సరాలు, మైసూరు రాజవంశస్తుడు జయచామరాజేంద్ర ఒడయార్ 6 సంవత్సరాలకు పైగా పని చేశారు. ఇప్పుడు వాజుభాయ్ వాలా కూడా సుమారు 7 సంవత్సరాలు కర్ణాటక గవర్నర్ గా పని చేశారు.

బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ?
గత ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇచ్చిన సమయంలో రాజకీయాలు మొత్తం గవర్నర్ వాజుభాయ్ వాలా చూట్టూ తిరిగాయి. కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో వాజూభాయ్ వాలా హాట్ టాపిక్ అయ్యారు.

ఎవరికి లాభం ?
గత ఏడాది కర్ణాటక గవర్నర్ గా ఉమాభారతి లేదా సుమిత్రా మహాజన్ నియమితులు అవుతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడం, కొత్త గవర్నర్ రాకపోవడంతో వాజుభాయ్ వాలా ఇంతకాలం ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు కొత్తగా తవార్ చంద్ గెహ్లెట్ నియమితులు కావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications