కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా యుటి ఖాదర్, చేతులు ఎత్తేసిన సీనియర్లు, మంత్రి పదవి !
బెంగళూరు/మంగళూరు: కర్ణాటక అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యుటి. ఖాదర్ ఎన్నిక అవుతున్నారు. మంత్రి పదవి అశించిన యుటి ఖాదర్ కు మొదటి విడతలొనే మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. బెంగళూరు చామరాజ్ పేట్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ కు చెక్ పెట్టి యుటి. ఖాదర్ కు మంత్రి పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొదటి విడతలో 8 మంత్రులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన లిస్ట్ లో బెంగళూరు ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ ఉండటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్న యుటి. ఖాదర్ కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్ అవుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో యుటి. ఖాదర్ మంగళూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు.

మంగళవారం మద్యాహ్నం 11 గంటలకు యుటి. ఖాదర్ కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ పదవికి నామినేషన్ సమర్పిస్తున్నారు. యుటి. ఖాదర్ ను స్పీకర్ చెయ్యడానికి నామినేషన్ పత్రాల్లో ఎమ్మెల్యేల సంతకాలు పెట్టించే పనిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బిజీగా ఉన్నారు.
కర్ణాటక స్పీకర్ పదవి కోసం మొదట కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు ఆర్.వీ. దేశ్ పాండ్, టీబి, జయచంద్ర, హెచ్ కే. పాటిల్ పేర్లు తెర మీదరు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాల స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వాలని అని అనేక మంది నాయకులతో చర్చలు జరిపారు.
మీరు స్పీకర్ గా పని చెయ్యాలని మొదట ఆర్ వీ. దేశ్ పాండ్ కు మనవి చేశారు. అయితే తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, స్పీకర్ గా పని చెయ్యలేనని, తనకు మంత్రి పదవి కావాలని ఆర్ వీ. దేశ్ పాండ్ హైకమాండ్ కు చెప్పారు. తరువాత మాజీ మంత్రి హెచ్.కే పాటిల్, సీఎం సిద్దరామయ్యకు చాలా సన్నిహితుడు అయిన అళంద ఎమ్మెల్యే బిఆర్. పాటిల్ ను సంప్రధించినా ఆయన కూడా స్పీకర్ పదవిలో ఉండటానికి నిరాకరించారని తెలిసింది.

చివరికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అన్ని ఆలోచించి మంగళూరు ఎమ్మెల్యే, మంత్రి పదవి ఆశిస్తున్న యుటి. ఖాదర్ ను కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎంపిక చేశారని తెలిసింది. డీకే శివకుమార్ సీఎం అయ్యే సమయంలో యుటి. ఖాదర్ కు మంత్రి పదవి ఇష్తామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చిందని తెలిసింది.
గతంలో కర్ణాటక శాసనసభలో డిప్యూటీ అపోజీషన్ లీడర్ గా యుటి. ఖాదర్ పని చేసిన అనుభవం ఉంది. ముస్లీంలకు స్పీకర్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో లబ్దిపొందాలని ప్రయత్నించిందని సమాచారం. మొత్తం మీద మంత్రి పదవి వస్తుందని ఆశపడిన యుటి. ఖాదర్ కు స్పీకర్ పదవి రావడంతో ఆయన ఇష్టం లేకుండానే ఈ రోజు నామినేషన్ వేస్తున్నారని తెలిసింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications