రేపు భారత్ బంద్, మమత ఆగ్రహం: తెరిచేవి, మూతబడేవి..
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 2వ తేదీన ట్రేడ్ యూనియన్స్ భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. కేంద్రం పెంచిన కనీస వేతనాన్ని, ఇతరాలను ట్రేడ్ యూనియన్స్ వ్యతిరేకించాయి. కేంద్రం తమ డిమాండ్లేమీ నెరవేర్చలేదంటూ ట్రేడ్ యూనియన్స్ బంద్ చేయాలనే నిర్ణయించాయి.
ట్రేడ్ యూనియన్ డిమాండ్ మేరకు ప్రస్తుతం ఉన్న కనీస వేతనంను రూ.350కి పెంచడానికి ప్రభుత్వం అంగీకరించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్ల పెండింగ్ బోనస్ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే కార్మికుల మేజర్ డిమాండ్లేమీ ప్రభుత్వం పరిష్కరించలేదని, బంద్ వెనక్కి తీసుకునేది లేదని సీఐటీయూ వెల్లడించింది.
మమతా బెనర్జీ ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సిఐటియు నిర్వహించతలపెట్టిన బంద్ పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ట్విట్టర్ ద్వారా ఈ అంశంపై స్పందించారు. జనజీవనానికి అంతరాయం కలిగిస్తే ఊరుకోబోమన్నారు.
రేపు తమ రాష్ట్రం స్తంభించదన్నారు. స్కూళ్లు, కాలేజీలు, దుకాణాలు, కార్యాలయాలు, కర్మాగారాలు రేపు తెరుచుకునే ఉంటాయన్నారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థ సేవలు కూడా ప్రజలకి అందుతాయన్నారు. ఎవరైనా అడ్డుతగిలితే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రేపటి బంద్లో తమ రాష్ట్రంలో వాహనాలు, దుకాణాలు ధ్వంసమైతే వాటికి తాము పరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఏవి మూతబడతాయి?
- 15 కోట్ల మంది కార్మికులు భారత్ బంద్లో పాల్గొంటారు. ఇందులో ప్రభుత్వ, ప్రయివేటు సెక్టార్ కార్మికులు ఉన్నారు. బ్యాంకులు, ఇన్సురెన్స్ కంపెనీల కార్మికులు బందులో పాల్గొంటారు.
- ఎలక్ట్రిసిటీ, ట్రాన్సుపోర్ట్, మైనింగ్, డిఫెన్స్, టెలికాం, ఇన్సురెన్స్ వంటి సర్వీస్ సెక్టార్ల పైన ప్రభావం పడుతుంది.
- బ్యాంకులు, గవర్నమెంటు కార్యాలయాలు, ఫ్యాక్టరీలలో ఎక్కువ వరకు మూసివేసి ఉంటాయి.
- పబ్లిక్ ట్రాన్సుపోర్ట్ సర్వీసు పైన ప్రభావం పడనుంది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి పలుచోట్ల ఆటా రిక్షా యూనియన్లు బందులో పాల్గొంటున్నాయి.
ఏం తెరిచి ఉంటాయి?
- రైల్వే కార్మికులు అందరూ భారత్ బందులో పాల్గొంటారా లేదా తెలియాల్సి ఉంది.
- పాఠశాలలు, కళాశాలలో అధికారికంగా సెలవు దినంగా ప్రకటించలేదు. స్థానికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఏ యూనియన్లు భారత్ బంద్లో పాల్గొంటున్నాయి?
- లెఫ్ట్ ట్రేడ్ యూనియన్లు ఐఎన్చటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయు, ఏఐటీయూసి, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, యూటీయూఎస్, ఎల్పీఎఫ్లు పాల్గొంటున్నాయి.
- భారతీయ మజ్దూర్ సంగ్ (బీఎంఎస్) భారత్ బంద్లో పాల్గొనడం లేదు.
డిమాండ్ ఏమిటి?
- కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. కార్మిక చట్టాలను మార్చాలని డిమాండ్ చేస్తున్నరు.
- అసంఘటిత సంస్థలలో కనీస వేతనం రూ.18,000గా ఉండాలి.
- కాగా, ప్రభుత్వం ఇప్పటికే పలు డిమాండ్లు నెరవేర్చింది. కానీ కార్మిక సంఘాలు తగ్గడం లేదు. మొత్తం హామీలు నెరవేర్చడం లేదంటున్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications