నేడు భారత్ బంద్: నిలిచిన రవాణా - విద్యా సంస్థలు, బ్యాంకులు..!!
భారత్ బంద్ కు పలు సంఘాలు నిర్ణయించాయి. ఈ రోజు (గురువారం) భారత్ బంద్ నిర్వహించాలని కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రవాణా వ్యవస్థ నిలిచి పోనుంది. ఆటో డ్రైవర్ల సంఘాలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. లేబర్ యాక్టులకు నిరసనగా దేశ వ్యాప్తంగా బంద్ కు నిర్ణయం తీసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని కార్మిక - రైతు సంఘాలు ఈ బంద్ కు మద్దతు ప్రకటించాయి. బ్యాంకుల పైన ప్రభావం పడింది. బ్యాంకులతో పాటుగా ఇన్స్యూరెన్స్ సేవల పైనా ప్రభావం పడింది. విద్యా సంస్థల పైనా బంద్ ఎఫెక్ట్ కనిపిస్తోంది.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఈ రోజు భారత్ బంద్ నిర్వహించాలని రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఆ సంఘం కన్వీనర్ హన్నన్ మొల్లా మీడియాతో మాట్లాడుతూ రెండు దేశాల వాణిజ్య ఒప్పందం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది భారత రైతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. అమెరికా నేర్పరితనానికి భారత ప్రభుత్వం లొంగిపోయిందని ఆయన ఆరోపించారు.

ఈ నెల 12న జరగను న్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలుగు రాష్ట్రాల్లోని వామపక పార్టీల నేతలు పిలుపునిచ్చాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తుందని, నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు 3 లేబర్కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ - చట్టం- 2025, వీబీజి రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ ఐసీలో 100శాతం విదేశీ పెట్టు బడులకు అనుమతించడం వంటి ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి.
నిలిచిపోతున్న రవాణా వ్యవస్థ
తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష పార్టీలు.. కార్మిక, విద్యార్థి అనుబంధం సంఘాలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. ఇదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ ఆటో, ప్రైవేట్ మోటార్ డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వెంకటేశం ఆరోపించారు. కార్మికుల నడ్డివిరిచే దుర్మార్గమైన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నిర్వహిస్తున్న జాతీయ సార్వత్రిక సమ్మెలో రవాణా రంగ కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. బ్యాంకు ఉద్యోగ సంఘాల నుంచి సానుకూల స్పందన కనిపిస్తోంది. దీంతో, బ్యాంకింగ్ సేవల పైనా ప్రభావం పడింది. ఇక.. పరీక్షల సమయం కావటంతో విద్యా సంస్థల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications