దారుణం.. 8 ఏళ్ల బాలికపై 32 ఏళ్ల వ్యక్తి అత్యాచారం... కంటైనర్లోకి లాక్కెళ్లి అఘాయిత్యం...
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై 32 ఏళ్ల ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని పిలిచి పొగాకు పొట్లం తీసుకురావాల్సిందిగా కోరాడు. బాలిక పొగాకు పొట్లం తీసుకురాగా... దాన్ని వేరే వ్యక్తికి ఇవ్వాలని సమీపంలోని ఓ కంటైనర్ వద్దకు బాలికను పంపించాడు. బాలిక వెనకాలే వెళ్లిన అతను... బలవంతంగా చిన్నారిని కంటైనర్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
అసలేం జరిగింది...
గుజరాత్కు
చెందిన
32
ఏళ్ల
ఓ
వ్యక్తి
బతుకుదెరువు
కోసం
మధ్యప్రదేశ్లోని
భోపాల్కి
వచ్చి
అక్కడే
ఉంటున్నాడు.
అతనికి
వివాహమైనప్పటికీ...
కొన్నేళ్ల
క్రితం
భార్య
అతన్ని
వదలిపెట్టింది.
అప్పటినుంచి
ఒక్కడే
ఉంటున్నాడు.
ఇదే
క్రమంలో
శనివారం(మార్చి
19)
మధ్యాహ్నం
ఒంటిగంట
సమయంలో...
స్థానికంగా
ఉన్న
ఓ
ఇంటి
ముందు
ఎనిమిదేళ్ల
చిన్నారి
ఆడుకోవడం
గమనించాడు.
ఆమెను
పిలిచి
సమీపంలోని
దుకాణానికి
వెళ్లి
పొగాకు
పొట్లం
తీసుకురావాలని
కోరాడు.
కంటైనర్లోకి లాక్కెళ్లి అత్యాచారం
అతను చెప్పినట్లుగానే బాలిక పొగాకు పొట్లం తీసుకొచ్చింది. అయితే అది తనకు కాదని... వేరే వ్యక్తికి ఇవ్వాలని సమీపంలోని ఓ కంటైనర్ వద్దకు పంపించాడు. ఆ బాలిక కంటైనర్ వైపు నడుస్తుండగా వెనకాలే అతనూ వెళ్లాడు. కంటైనర్ను సమీపించగానే బాలికను బలవంతంగా దాని లోపలికి లాక్కెళ్లి తలుపులు మూశాడు. ఆపై ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో బాలిక షాక్లోకి వెళ్లింది. కాస్త తేరుకున్న తర్వాత ఇంటికెళ్లిన ఆ బాలిక నానమ్మతో జరిగిన విషయం చెప్పింది.
నిందితుడిని గుర్తించిన బాలిక...
బాధిత బాలికను వెంటపెట్టుకుని ఆమె నానమ్మ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అయోధ్యనగర్ ప్రాంతంలో 40 మంది అనుమానితుల ఫోటోలు సేకరించి బాధిత బాలికకు చూపించారు. వాళ్లలో ఒకరిని నిందితుడిగా బాలిక గుర్తుపట్టింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిజానికి అత్యాచారం చేసిన వెంటనే అతను గుజరాత్ పారిపోవాలనుకున్నాడని... కానీ ఆదివారం(మార్చి 21) లాక్డౌన్ కారణంగా వీలు కాలేదని పోలీసులు వెల్లడించారు.నిందితుడిపై పోక్సో చట్టం 376 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.