హైదరాబాదు: తెలంగాణలోని దుబ్బాకలో ఉపఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. సోమవారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతిపై దాడి చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా ఓటరు మాత్రం ఎవరికి ఓటు వేయాలన్నదానిపై క్లారిటీతో ఉన్నాడు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ కోసం సన్నాహాలు పూర్తయ్యాయి. 17 జిల్లాల్లో 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 7 గంటలకు రెండోదశ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్నికల పోలింగ్ నాటికి రెండురోజుల ముందే ప్రచార పర్వానికి తెరపడింది.
రెండో దశ పోలింగ్లో మొత్తం 2.85 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెండో దశలో 1500 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక రెండో దశలో వెస్ట్ చంపారన్, ఈస్ట్ చంపారన్, షెయోహర్, సీతమర్హి, మధుబని, దర్భాంగా, ముజాఫర్పూర్, గోపాల్ గంజ్చ సివాన్, శరన్, వైశాలి, సమస్తిపూర్, బెగుసరాయ్, ఖగారియా, భగల్పూర్, నలంద, పాట్నా జిల్లాలో పోలింగ్ జరగనుంది. ఇక రెండో దశ పోలింగ్ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఉన్నాడు. వైశాలి జిల్లా రఘుపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వీ బరిలోకి దిగుతున్నాడు. సమిస్తాపూర్ జిల్లా హసన్పూర్ నియోజకవర్గం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ బరిలో దిగుతున్నాడు.
Nov 03, 2020, 6:19 pm IST
బీహార్
ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్. 94 సీట్లకు ముగిసిన పోలింగ్
Nov 03, 2020, 6:18 pm IST
నవంబర్ 10న దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు
Nov 03, 2020, 6:17 pm IST
దుబ్బాకలో ముగిసిన ఉపఎన్నిక పోలింగ్. సాయంత్రం 6 గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటువేసేందుకు అవకాశం
Nov 03, 2020, 6:04 pm IST
మధ్యప్రదేశ్
సాయంత్రం 5:30 సమయానికి మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో 66.09 శాతం పోలింగ్ నమోదు
Nov 03, 2020, 5:25 pm IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: సివాన్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు బారులు తీరిన మహిళలు.
#BiharElection: Women seen standing in queue at a polling station in Siwan to vote for the second phase of the Assembly election, earlier today. pic.twitter.com/Y4PGGK0SeR
భారత్ మాతా కీ జై, జైశ్రీరాం నినాదాలు మహాగట్భంధన్కు ఇబ్బందిగా మారాయి: ప్రధాని మోడీ
Nov 03, 2020, 1:44 pm IST
దుబ్బాక
దుబ్బాకలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదు
Nov 03, 2020, 1:35 pm IST
సిద్ధిపేట
సిద్దిపేట తన నివాసంలో ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని సమీక్షిస్తున్న మంత్రి హరీష్ రావు,ఎమ్మెల్యే క్రాంతి కిరణ్,చింత ప్రభాకర్, దేవందర్ రెడ్డి గారు వివిధ మండలాల ఇంచార్జ్ పాల్గొన్నారు
Nov 03, 2020, 1:07 pm IST
పాట్నా
పాట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
మధ్య ప్రదేశ్లో 29 స్థానాలకు ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో కమల్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రానికి ఏమీ చేయలేదు.. ప్రజలు మరోసారి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు: కమల్నాథ్
People of #MadhyaPradesh know that Shivraj Singh Chouhan has just lied in the last 6 months and has done nothing for the development of the state. Voters will now give a chance to Congress to work for the state: Kamal Nath, Congress on by-elections for 29 state assembly seats pic.twitter.com/Kqnjq5hdW4
దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ అదనపు ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్
Nov 03, 2020, 12:20 pm IST
దుబ్బాక
దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
Nov 03, 2020, 11:46 am IST
బీహార్లో గత పదేళ్లలో ప్రతి ఇంటికి విద్యుత్,మరియు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. రానున్న రోజుల్లో బీహారీల ఆకాంక్షలను నెరవేరుస్తాం: ప్రధాని మోడీ
In the last decade, every house in the state of Bihar got electricity and gas connections. Now, from 2021 to 2030, it is time to fulfill more aspirations of the people of Bihar: Prime Minister Narendra Modi at a public rally in Forbesganj in Araria district. #BiharElections2020pic.twitter.com/OCOraut5u7
ఇప్పటి వరకు ఐదు ఎన్నికల్లో నాలుగుసార్లు విజయఢంకా మోగించిన టీఆర్ఎస్ పార్టీ
Nov 03, 2020, 10:38 am IST
దుబ్బాకలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న గులాబీ దళం
Nov 03, 2020, 10:34 am IST
దుబ్బాకలో ఉదయం 9 గంటల వరకు 12.74శాతం పోలింగ్ నమోదు
Nov 03, 2020, 10:12 am IST
ఉత్తర ప్రదేశ్
ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్న ఉత్తర ప్రదేశ్లో ఉదయం 9 గంటల సమయానికి 7.87 శాతం పోలింగ్ శాతం నమోదైనట్లు వెల్లడించిన ఎన్నికల అధికారులు. యూపీలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
Average voter turnout of 7.87% recorded till 9 am across seven assembly by-poll constituencies: Joint chief Electoral Officer, Uttar Pradesh
ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్న మధ్యప్రదేశ్ గ్వాలియర్లోని ఓ పోలింగ్ కేంద్రానికి చేతుల మీద తన తల్లిని ఎత్తుకొచ్చిన వ్యక్తి.
#WATCH Madhya Pradesh: A man carries his elderly mother in his arms to the polling booth in Gwalior to help her cast her vote in the by-election to the state assembly constituency.
మంగళవారం బీహార్లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్
10:44 PM, 2 Nov
మొత్తం 94 స్థానాలకు జరగనున్న పోలింగ్
10:57 PM, 2 Nov
రెండో దశ పోలింగ్లో 19 జిల్లాలు..బరిలో పలువురు ప్రముఖులు
10:59 PM, 2 Nov
మంగళవారం బీహార్లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్
11:14 PM, 2 Nov
ఆన్లైన్ విధానంలో ఓటు వేసిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
Speaker of Lok Sabha Om Birla and Lok Sabha MP Poonamben Maadam and Rajya Sabha MP Swapan Dasgupta had cast their votes through an online voting mechanism https://t.co/jSGygQ3exP
సీఎం, ఎమ్మెల్యేల జీతాలు ఆపి అయినా సరే 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: తేజస్వీ యాదవ్
2:12 AM, 3 Nov
ప్రధాన పార్టీలకు కీలకం కానున్న రెండో విడత పోలింగ్
2:13 AM, 3 Nov
10 లక్షల ఉద్యోగాల పేరుతో యువతను ఆకట్టుకుంటున్న తేజస్వి యాదవ్
2:14 AM, 3 Nov
19 లక్షల ఉద్యోగాలు అని మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటన
2:14 AM, 3 Nov
15 ఏళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్న నితీశ్, ఆర్జేడీ మాత్రం 15 ఏళ్లలో లక్ష కూడా ఇవ్వలేదు అని విమర్శలు
6:13 AM, 3 Nov
బిహార్
బిహార్లో ఓటర్లు మార్పును కోరుకుంటున్నారని, ఈ సారి తమ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తారని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్. 15 సంవత్సరాల నితీష్ కుమార్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని, వారు ప్రత్యామ్నాయంగా తమను గెలిపిస్తారని చెప్పారు.
In this tsunami of change people of Bihar will vote on agenda of 'Padhai, Kamai, Dawai, Sichai, Mehengai'. I'm sure they'll vote for us as they want a change in state, they want proactive & progressive govt. People of Bihar will vote for change: Tejashwi Yadav, RJD #BiharPollspic.twitter.com/OMMOCQk1YA
బిహార్ తొలిదశ పోలింగ్లోనే బిహార్ ప్రజలు తమకు మెజారిటీ సీట్లను అప్పగించారని, రెండు, మూడోదశ పోలింగ్లో అవే పరిస్థితులు కొనసాగుతాయని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
It will be clear, first phase has already given an indication: RJD leader Tejashwi Yadav when asked who will be the CM of Bihar#BiharPollshttps://t.co/2MC4fDYE7z
బిహార్ అసెంబ్లీ రెండోదశ పోలింగ్ సందర్భంగా రాఘోపూర్లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటించడం, మాస్క్లను ధరించడం తప్పనిసరి చేశారు.
Bihar: Voters maintain social distancing as they stand in queues to cast their votes for the second phase of #BiharElections. Visuals from booth number 24 of Raghopur Assembly constituency. pic.twitter.com/vZxp894ak7
ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్న ఉత్తర ప్రదేశ్లో ఘాతమ్పూర్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని సుందరంగా అలంకరించారు అధికారులు. యూపీలో మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఆయా చోట్ల పోలింగ్ ఆరంభమైంది.
Kanpur: Voting to be held on 7 seats in the state today, for by-elections to the state legislative assembly. Visuals from polling booth number 218 in Ghatampur constituency. pic.twitter.com/WpxcUJwIDS
బిహార్ అసెంబ్లీ రెండోదశ పోలింగ్ సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న గవర్నర్ ఫగు చౌహాన్. రాజధాని పాట్నాలో దిఘా ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ప్రతి ఒక్కరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఙప్తి చేశారు. ఇదివరకటి కంటే ఈ సారి పోలింగ్ శాతం పెరుగుతుందనే నమ్మకం ఉందని చెప్పారు.
Bihar: Governor Phagu Chauhan cast his vote for 2nd phase of #BiharElections, at the polling booth at government school in Digha, Patna. He says, "I appeal to the people to participate in election in large numbers. I hope that voting percentage will be more than previous time." pic.twitter.com/6HsmpS4aUj
బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ దశలో రాష్ట్రీయ జనతాదళ్ నేతలు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ సహా మొత్తం 1463 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 17 జిల్లాల్లో 94 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ఆరంభమైంది.
Voting begins for the second phase of Bihar Assembly polls. 1463 candidates, including RJD leaders Tejashwi Yadav and Tej Pratap Yadav, in fray for 94 seats across 17 districts.#BiharElectionspic.twitter.com/qomEOAwgOH
బిహార్ రెండోదశతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. మధ్యప్రదేశ్-28, గుజరాత్-8, ఉత్తర ప్రదేశ్-7, కర్ణాటక, జార్ఖండ్, నాగాలాండ్లల్లో రెండు చొప్పున, తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానాల్లో ఒక్కొక్క స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది.
Voting also begins for the by-election in 54 Assembly seats across 10 states.
28 seats in Madhya Pradesh, 8 in Gujarat, 7 in Uttar Pradesh, 2 each in Odisha, Nagaland, Karnataka & Jharkhand, and one seat each in Chhattisgarh, Telangana & Haryana going to polls today. https://t.co/HojHon2vFv
బిహార్ అసెంబ్లీ రెండోదోశ పోలింగ్ సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ. పాట్నా రాజేంద్రనగర్లోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఙప్తి చేశారు.
I appeal to the people to step out of their homes, cast their vote, maintain social distancing and keep wearing mask: Deputy Chief Minister Sushil Kumar Modi after casting his vote at polling booth no.49 at St Joseph High School in Rajendra Nagar, Patna #BiharElectionspic.twitter.com/iTon66FQsO
బిహార్ అసెంబ్లీ రెండోదశ పోలింగ్ సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న లోక్ జన్శక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్. రాఘోపూర్లో ఆయన ఓటు వేశారు. ఈ నియోజకవర్గంలో ఆయన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను ఢీకొడుతున్నారు.
బిహార్ అసెంబ్లీ రెండోదశ పోలింగ్ సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రాజధాని పాట్నాలోని పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు.
Bihar: Social distancing norms being followed as voters stand in queues at polling booth no. 325 & 326 in Patna to cast their votes for the second phase of #BiharElections. pic.twitter.com/QXzgDOM0cs
ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్న మధ్యప్రదేశ్ గ్వాలియర్లో శిశువిహార్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు. భౌలిక దూరాన్ని పాటించడం, మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేశారు అధికారులు.
Madhya Pradesh: Voting underway at polling booth no. 258 in Gwalior for the by-election to the state assembly constituency.
బిహార్ రెండోదశ పోలింగ్ సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి సైకిల్పై నాయనమ్మతో వచ్చిన యువతి. తాను మొదటిసారిగా ఓటును వేయబోతున్నట్లు వెల్లడి. కొత్త ప్రభుత్వం నిరుద్యోగాన్ని రూపుమాపుతుందనే నమ్మకంతో ఓటు వేయబోతున్నట్లు స్పష్టం చేసిన యువతి. తనలాగే కొత్త ఓటర్లు ఓటు వేయాలంటూ సూచన.
Bihar: A girl arrived at a polling booth in Patna with her grandmother on cycle to cast vote in the 2nd phase of #BiharElections
"I've come here with my grandmother. I'll be voting for the first time. I hope we'll have more employment opportunities for youth now," says the girl pic.twitter.com/qSwUmXO593
ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్న గుజరాత్ సురేంద్ర నగర్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేయడానికి బారులు తీరి నిల్చున్న ఓటర్లు. గుజరాత్లో మొత్తం ఎనిమిది స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది.
Gujarat: Voting underway at a polling booth in Surendranagar for the by-election to the state assembly constituency.
ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్న మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తోన్న సిబ్బంది. కరోనా పరిస్థితుల వల్ల ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్, భౌతికదూరాన్ని తప్పనిసరి చేశారు.
మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
मध्य प्रदेश: इंदौर में राज्य विधानसभा उपचुनाव के लिए मतदान चल रहे हैं। कोरोना महामारी में हो रहे इस उपचुनाव में मतदान केंद्र पर लोगों की थर्मल स्क्रीनिंग और सैनिटाइजेशन के इंतजाम किए गए हैं। मध्य प्रदेश में आज विधानसभा की 28 सीटों पर उपचुनाव के लिए मतदान हो रहे हैं। pic.twitter.com/nC0v6ZPzMb
ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్న కర్ణాటకలో బెంగళూరు సిటీ పరిధిలోని రాజరాజేశ్వరి నగరలో తనఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థిని హెచ్ కుసుమ. జెఎస్పీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
Bengaluru: Congress candidate for RR Nagar by-poll, Kusuma H cast her vote at polling centre set up in JSPU College#Karnatakapic.twitter.com/SKwTf73srz
ఉప ఎన్నికను ఎదుర్కొంటోన్న తెలంగాణలోని సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని చిట్టాపూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థిని సోలిపేట సుజాత.
9:12 AM, 3 Nov
గుజరాత్
ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్న గుజరాత్లోని వడోదరాలో తన ఓటు హక్కును వినియోగించుకున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యోగేశ్వర్ దత్
Sonipat: BJP candidate for by-election to the Baroda assembly constituency, Yogeshwar Dutt cast his vote at a polling booth in Bhainswal Kalan
The second phase of the Bihar Assembly election is scheduled to be held on Tuesday (3 November). The second of the three-phased poll will see over 2.85 crore voters cast their ballot, while there are nearly 1,500 candidates in the fray