మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్
మహిళలకు గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ అమలు కానుంది. ఈ నిర్ణయంతో మహిళలు అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ పడతారని ప్రభుత్వం భావిస్తోంది. బిహార్ లోని మహిళలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బీహార్లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక మహిళలకు 35 శాతం రిజర్వేషన్ ప్రకటించింది. ఈ మేరకు కేబినేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బిహార్ లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. ఈ ఏడాది చివర్లో బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నితీశ్ సర్కార్ కేబినేట్ సమావేశం నిర్వహించింది. మహిళలు, రైతుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు బిహార్ లోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బీహార్లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక మహిళలకు 35 శాతం రిజర్వేషన్ ప్రకటించింది. అంతేకాక రైతులకు రూ. 100 డీజిల్ సబ్సిడీ ప్రకటించింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటినుంచే అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహాఘట్ బంధన్ సిద్ధమవుతున్నాయి. అయితే తాజాగా బిహార్ లోని నితీశ్ ప్రభుత్వం కేబినేట్ సమావేశం నిర్వహించింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం 43 స్కీమ్ లు, ప్రాజెక్టులకు అంగీకారం తెలిపారు.

బిహార్ యూత్ కమిషన్ ఏర్పాటు, స్థానిక మహిళలకు 35 శాతం రిజర్వేషన్, రైతులకు రూ. 100 డీజిల్ పై సబ్సిడీ తదితర పథకాలు ఉన్నాయి. మహిళలకు సంబంధించి కేవలం బిహార్ లో పుట్టి పెరిగిన మహిళలకే ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. హారిజాంటల్ విధానంలో ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లోని అన్ని పోస్టులకూ ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి.
#Bihar Government to implement domicile policy for government jobs reserved for women. Only female Bihar residents will benefit from the 35% reservation.#WomenReservation
— All India Radio News (@airnewsalerts) July 8, 2025
మరోవైపు దేశంలో మొబైల్ యాప్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న తొలి రాష్ట్రంగా బిహార్ రికార్డ్ నెలకొల్పింది. ఇటీవల రాష్ట్రంలోని ఆరు మున్సిపల్ కౌన్సిల్లకు జరిగిన ఎన్నికల్లో ఈ విధానం అమలు చేశారు. పోలింగ్ బూత్ లకు చేరుకోలేని వయోవృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు, వలస కార్మికులతో పాటు ఇతరులు మొబైల్ యాప్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇది విజయవంతం కావడంతో రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications