నితీశ్ వారసుడు వచ్చేసారు, బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు..!!
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ రాజ్యసభ కు వెళ్లటం ఖాయమైంది. ఆయన స్థానంలో బీజేపీ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోనుంది. ఇప్పటి కే ఈ మేరకు ఒప్పందం జరిగింది. నితీశ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో నితీశ్ కుమారుడు నిశాంత్ తాజా ఎంట్రీ ఆసక్తి కరంగా మారుతోంది. నిశాంత్ డిప్యూటీ సీఎం అవుతారనే ప్రచారం వేళ.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ సొంత పార్టీ జేడీయూలో చేరారు. పార్టీ నేతల మధ్య జేడీయూ కండువా కప్పుకొన్నారు. జేడీయూ అధ్యక్షుడు, బిహార్ సీఎం అయిన నితీష్ కుమార్ రాజ్యసభకు ఎంపిక కావటం లాంఛనమే. ఈ నేపథ్యంలో పార్టీని ఎవరు నడిపిస్తారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. పార్టీని నడిపించేందుకే నిశాంత్ను నితీష్ రాజకీయాల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. నిశాంత్ వయసు 50. సాధారణంగా నితీష్ కుమార్ లాంటి అగ్రనేత లు తమ వారసుల్ని చిన్న వయసులోనే రాజకీయాలకు తీసుకొస్తుంటారు. కానీ, నిశాంత్ను మాత్రం నితీష్ రాజకీయాలకు దూరంగా ఉంచారు. ఇప్పటి వరకు నితీష్ వారసత్వ రాజకీయాల కు వ్యతిరేకమనే ప్రచారం ఉంది. అయితే, ప్రస్తుతం నితీష్ రాష్ట్రాన్ని వదిలి కేంద్రానికి వెళ్తుండటంతో, తప్పనిసరిగా రాష్ట్ర బాధ్యతలు చూసేందుకు నిశాంత్ను పార్టీలోకి తీసుకొచ్చారు.

వచ్చే వారం బీహార్ లో కీలక పరిణామాలు
జేడీయూలో చేరిన నిశాంత్కు బిహార్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కనుందని తెలుస్తోంది. కాగా, నిశాంత్కు బిహార్ డిప్యూటీ సీఎం పదవి వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మాట్లాడుతూ పార్టీని నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని నిశాంత్ హామీ ఇచ్చారు. తన తండ్రి నితీష్ రాజ్యసభకు వెళ్లాలన్నది ఆయన సొంత నిర్ణయమని, దాన్ని గౌరవిస్తానన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో రాష్ట్రం కోసం పనిచేస్తానని వెల్లడించారు. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన తర్వాత నితీష్ బిహార్ సీఎం పదవికి రాజీనామా చేస్తారు. తనతండ్రి మార్గదర్శకత్వంలో తామంతా పనిచేస్తామని నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. 20ఏళ్లు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తనతండ్రి రాష్ట్రానికి ఎంతో చేశారని చెప్పారు. బిహార్ ప్రజలు ఆయన చేసిన అభివృద్ధిని ఎప్పటికీ మరిచిపోరని తెలిపారు.
-
నితీశ్ తర్వాత వికెట్ చంద్రబాబే? మాజీ కేంద్రమంత్రి జోస్యం..! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..













Click it and Unblock the Notifications