Bihar Exit Polls 2020: టీవీ-9 భారత్ వర్ష్ కూడా.. కూటమికే మెజార్టీ సీట్లు, రెండోస్థానంలో ఎన్డీఏ
బీహర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. దాదాపు అన్నీ మహగడ్ బందన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. లేదంటే హంగ్ ఏర్పడుతోందని చెబుతున్నాయి. కూటమి- ఎన్డీఏ మధ్య 5 నుంచి 10 సీట్ల తేడా మాత్రమే కనిపిస్తోంది. అయితే టీవీ-9 భారత్ వర్ష్ పోల్స్ లెక్కగట్టింది. ఈ సర్వే కూడా కాంగ్రెస్ కూటమికి మొగ్గుచూపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మహగడ్ బందన్ 115 నుంచి 125 సీట్లు గెలుచుకుంటుందని లెక్కగట్టింది. ఎన్డీఏ 110 నుంచి 120 వరకు గెలుచుకోవచ్చని తెలిపింది. రాష్ట్రంలో 243 సీట్లు ఉండగా.. అధికారం చేపట్టాలంటే 122 సీట్లు కావాలి. ఈ లెక్కన ఎల్జేపీ, ఇతరులు కీలక పాత్ర పోషిస్తారా అనే అంచనాలు నెలకొన్నాయి. ఎల్జేపీ 3 నుంచి 5 సీట్లు, ఇతరులు 10 నుంచి 15 సీట్ల వరకు గెలుచుకుంటుందని తెలిపింది.

బీహర్ అసెంబ్లీలో 243 నియోజకవర్గాలు ఉన్నాయి. మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. అక్టోబర్ 28వ తేదీన తొలి విడత.. ఈ నెల 3వ తేదీన రెండో విడత ఎన్నికలు జరిగాయి. శనివారం ఇవాళ మూడో విడత 78 నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోనుంది. రాష్ట్రంలో మొత్తం 243 సీట్లు ఉండగా.. అధికారం చేపట్టాలంటే 122 సీట్లు తప్పనిసరి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications