బిహార్లో ఆయన శకం ముగిసినట్టే? ప్రభావం చూపలేని యువనేత: సింగిల్ డిజిట్కే లిమిట్?
పాట్నా: ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ తరువాత ఆ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న రాష్ట్రం.. బిహార్. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతి పెద్ద నియోజకవర్గాల్లో అదీ ఒకటి. కేంద్రంలో అధికారాన్ని ఎవరు అందుకోవాలనే విషయాన్ని నిర్ధారించే సామర్థ్యం బిహార్ రాజకీయాలకు ఉన్నాయి. అలాంటి కీలక రాష్ట్రంలో ఓ జాతీయ స్థాయి నాయకుడి శకం ముగిసినట్టే కనిపిస్తోంది. ఆయన వారసత్వాన్ని కొనసాగించే అవకాశాలు ఇప్పట్లో లేనట్టేననే విషయాన్ని తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అసలు ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇంకా తేలాల్సి ఉంది.
బిహార్లో రామ్ విలాస్ పాశ్వాన్ శకానికి తెర పడినట్టేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ను బిహారీయులు ఆదరించలేదని అభిప్రాయపడుతున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారని చెబుతున్నాయి. చిరాగ్ పాశ్వాన్ సారథ్యాన్ని వహిస్తోన్న లోక్ జన్శక్తి పార్టీ (ఎల్జేపీ)కి అయిదు కంటే ఎక్కువ స్థానాలు లభించకపోవచ్చని స్పష్టం చేశాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఒకట్రెండు ఎగ్జిట్ పోల్స్.. చిరాగ్ పాశ్వాన్ పార్టీకి ఒక్క సీటు మాత్రమే వస్తుందని అంచనా వేశాయి.

కేంద్రమంత్రిగా పనిచేసిన రామ్ విలాస్ పాశ్వాన్ బిహార్ రాజకీయాలపై పట్టు ఉంది. ఇదివరకు యూపీఏ కూటమిలో, ఆ తరువాత ఎన్డీఏలో ఆయన కీలక పాత్ర పోషించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ కేబినెట్లో.. ప్రస్తుతం నరేంద్ర మోడీ సర్కార్లోనూ ఆయన కేంద్రమంత్రిగా పనిచేశారు. కొద్దిరోజుల కిందటే కన్నుమూశారు. ఆయన వారసుడిగా చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ సారథ్యయ బాధ్యతలను అందుకున్నారు. మొట్టమొదటి సారిగా ఎన్నికలను ఎదుర్కొన్నారు. నిజానికి- సీట్ల సర్దుబాటు కుదురకపోవడంతో ఆయన ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు. ఒంటరిగా బరిలో నిల్చున్నారు.
బిహార్ భవిష్యత్ నేతగా చిరాగ్ పాశ్వాన్ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. అవి ఫలించట్లేదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో ఆయన రాఘోపూర్ నుంచి పోటీ చేశారు. అక్కడ ఆయన కూడా గెలవలేకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక ముందు చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగా పోటీ చేసిన ఆయన బలం ఏమిటో తేలిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ కూడా చిరాగ్ పాశ్వాన్ను ఆదరించడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవాల్సిన అవసరం రావొచ్చని అంటున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications