వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సతీ కాదు మృత్యువు.. ప్రియుడితో కలిసి దారుణం, తెలిసిందిలా..

|
Google Oneindia TeluguNews

కట్టుకున్న భార్యే కడతేర్చింది. ప్రియుడితో కలిసి మరీ హత్య చేసింది. జార్ఖండ్‌ దుమ్కాలో దారుణం జరిగింది. భార్య చేసిన దారుణం చూసిన వారి కుమార్తె చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఛిద్రం చేస్తాయని మరోసారి రుజువు అయ్యింది. ఇటీవల దేశంలో వరసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

జార్ఖండ్‌కు చెందిన సోనూ పోద్దార్ గుజరాత్‌లో పని చేస్తుండేవాడు. అతని భార్య గౌరీకి ఊరిలో ఉన్న వేరే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తర్వాత వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. పదిహేను రోజుల క్రితం సోనూ స్వగ్రామానికి తిరిగొచ్చాడు. దీంతో వీరిద్దరికీ అతను అడ్డుగా అనిపించాడు. సోనూ అడ్డు తొలగించాలని వీరిద్దరూ కలిసి పథకం వేశారు.

bizarre incident at jharkand

ఇద్దరూ కలిసి సోనూను హత్యచేశారు. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహన్ని సెప్టిక్ ట్యాంకులో పడేశారు. తల్లి చేసిన ఘాతుకాన్ని కుతూరు కిటికీలోంచి చూసింది. అయితే జరిగిన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని కూతురును బెదిరించింది. భయపడిన చిన్నారి నోరుమెదపలేదు. కొద్దీ రోజుల క్రితం తన స్నేహితురాలితో మాట్లాడుతున్న సమయంలో తండ్రి ప్రస్తావన వచ్చింది. అప్పుడు తాను చూసిన దారుణాన్ని స్నేహితురాలికి చెప్పింది. ఇలా ఆ నిజం గ్రామస్తులకు తెలిసింది.

పోలీసులకు సమాచారం అందించారు. కానీ పోలీసులు దర్యాప్తు చేయలేదు. జనం కలిసి పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసుపై దర్యాప్తు చేయాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గౌరీని, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల ఒత్తిడికి తలొగ్గిన జంట.. అసలు నిజం చెప్పేసింది. సెప్టిక్ ట్యాంకు నుంచి సోనూ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు.

English summary
wife and his lover murder to husband. incident happen at jharkand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X