19 ఏళ్ల యువతిపై గ్యాంగ్రేప్: 2 గంటల్లో ముగ్గురు అఘాయిత్యం, స్టేషన్లో దించమని కోరితే.. లైంగికదాడి..
మంచి అన్నది లేదు.. సాయం చేయమని అడిగితే పట్టించుకునే వారే లేరు. ఓ యువతి అర్ధరాత్రి తనకు సాయం చేయాలని అడిగితే ఒకడ లైంగికదాడి చేసి.. వదిలేసి పోయాడు. తాను వెళ్లాల్సిన స్టేషన్ వద్ద విడిచిపెట్టాలని మరో ఇద్దరినీ కోరితే వారు కూడా కామవాంఛ తీర్చుకున్నారు. నవీ ముంబైలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. యువతి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ నెల 19వ తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏం జరిగిందంటే..?
19 ఏళ్ల యువతి ఈ నెల 18వ తేదీన తన బంధువులతో కలిసి వస్తోంది. అయితే ఘాట్కోపర్ శివారులో వారు రైలును మిస్సయ్యారు. మరో రైలులో థానే జిల్లాలో గల ముంబ్రా రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. ఆ రోజు రాత్రి ఆమె అక్కడ గల రైల్వేస్టేషన్లో పడుకొన్నారు. మరునాడు ఉదయం దియ స్టేషన్ వెళ్లేందుకు యువతి వద్ద సరిపడ నగదు లేదు. దీంతో తన బంగారు ముక్కుపుడకను విక్రయించాలని అనుకొంది. అక్కడే ఉన్న ఓ బిచ్చడానికి ఆశ్రయించింది. అయితే అప్పటికే చీకటిపడటంతో వీలుపడలేదు. అలా దివ రైల్వేస్టేషన్కు వెళ్లేందుకు నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో మృగాళ్లకు చిక్కింది.
స్టేషన్లో దించమని కోరితే..
ఆమె అటుగా వెళ్తుండగా ఓ ఆటో డ్రైవర్ను తనను స్టేషన్లో దింపాలని అడిగింది. కానీ అతడు నవీముంబైలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. తర్వాత ఆమెను ఆలయ సమీపంలో వదిలేశాడు. అతని చేతిలో మోసపోయిన యువతి.. ఏం చేయాలని ఆలోచించింది. తన పరిస్థితిని తలచుకొని బాధపడింది. గుండె ధైర్యం చేసుకొని ముందడగు వేసింది.
Recommended Video
మరో ఇద్దరు
అటుగా వెళ్తున్న టూవీలర్ను సాయం అడిగింది. వారు కూడా రైల్వేస్టేషన్ వద్ద దింపుతామని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఘన్శొలి వద్దకు తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. రైల్వేస్టేషన్లో దింపుతానని తనపై లైంగికదాడి చేసిన ముగ్గురిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. ఆటో డ్రైవర్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.