Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఖజానా ఖాళీ చేసి ఢిల్లీలో సీఎం డ్రామాలు, న్యాయం చేసిన మోదీ, అన్యాయం చేసింది !

స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని పోల్చితే ఇంత వరకు ఎవ్వరూ ఇలాంటి అభివృద్ధి పనులు చెయ్యలేదని, గ్రాంట్లు విడుదల చేసే సమయంలో కూడా మోదీ తారతమ్యం చూపించలేదని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. కర్ణాటక మీద మోదీ వివక్ష చూపిస్తున్నారని సీఎం సిద్దరామయ్య ఆరోపించడం విడ్డూరంగా ఉందని విజయేంద్ర అన్నారు.

కర్ణాటకకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి న్యాయం జరిగిందని కన్నడిగులు అందరికి తెలుసని, కర్ణాటక ఖజానాను ఖాళీ చేస్తున్న సీఎం సిద్దరామయ్య అండ్ కో ఇప్పుడు ఛలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేసి కన్నడిగులను మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, ఛలో ఢిల్లీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకుల డ్రామాలా తయారు అయ్యిందని బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు విజయేంద్ర మండిపడ్డారు.

 BJP accuses CM Siddaramaiah of playing Delhi dramas after emptying Karnataka coffers

సీఎం సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కపటనాటకాలు ఆడటానికి ఢిల్లీకి వెళ్లారని, యూపీఏ ప్రభుత్వంలో కర్ణాటకకు ఎంత నిధులు వచ్చాయి, ఎన్ డీఏ హయామంలో కర్ణాటకకు ఎంత నిధులు వచ్చాయి అని సీఎం సిద్దరామయ్య బహిరంగంగా ప్రజలకు లెక్కలు చెప్పాలని బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు విజయేంద్ర సవాలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటకకు పూర్తి అన్యాయం జరిగిందని, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక కనీస వసతులులేని కర్ణాటకకు న్యాయం జరిగిందని విజయేంద్ర అన్నారు.

జలజీవన్ మిషన్ కనెక్టివిటీ, విమానాశ్రయాలు, మెట్రో కనెక్టివిటీ, రైల్వే ఇలా ప్రతి శాఖలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కర్ణాటకలో విప్లవాత్మక పథకాలు అమలు చేసిందని విజయేంద్ర అన్నారు. విద్యుద్దీకరణ. రాష్ట్ర కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైన కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం ప్రజావ్యతిరేక, రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, అవినీతికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కర్ణాటక ప్రజలకు న్యాయం చెయ్యడం లేదని విజయేంద్ర ఆరోపించారు.

 BJP accuses CM Siddaramaiah of playing Delhi dramas after emptying Karnataka coffers

కర్ణాటక ఖజానా ఖాళీ చేసిన తరువాత ఇప్పుడు విధానసౌధను ఖాళీ చేసి ఛలో ఢిల్లీ డ్రామాలు ఆడుతున్న సిద్దరామయ్య ప్రభుత్వం కర్ణాటక ప్రజల చెవిలో పూలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నదని విజయేంద్ర ఆరోపించారు. విధానసౌధలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి తాళం వేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దరామయ్య ప్రభుత్వం ప్రజలకు న్యాయం చెయ్యడం లేదని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు బుధవారం బెంగళూరు నగరంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+