కాంగ్రెస్ ఫినిష్, కాపాడే నాథుడేడి? - నాడు సింధియా, నేడు ఆజాద్-సిబల్ - సీడబ్ల్యూసీపై బీజేపీ రియాక్షన్
నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీలో సోమవారం నాటి 'కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)' సమావేశం తీవ్ర కలకలం రేపింది. వరుస పరిణామాలపై రాజకీయంగానూ దుమారం లేసింది. సోనియా గాంధీకి ఘాటు లేఖ రాసిన సీనియర్ నేతలు బీజేపీ ఉచ్చులో పడిపోయారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని వార్తలు రావడంతో కమలనాథులు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
Recommended Video
కాంగ్రెస్ సీనియర్లు బీజేపీతో కుమ్మకయ్యారన్న మాటలు తాను అనలేదని రాహుల్ గాంధీ వివరణ ఇచ్చుకున్నప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రధానంగా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ ను ఉద్దేశించి రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ప్రియాంక గాంధీ సైతం ఆజాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారని వచ్చిన వార్తలు, నాయకత్వం ఎవరు చేపట్టాలనేదానిపై ఎటూ నిర్ణయించుకోలని పరిస్థితిపై బీజేపీకి చెందిన మధ్యప్రదేశ్ ఎంపీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి అనూహ్య వ్యాఖ్యలు చేశారు.

''నాడు జ్యోతిరాదిత్య సింధియా విషయంలోనూ ఇదే జరిగింది. పార్టీకి ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ ఉండాలన్న సింధియాపై బీజేపీ కోవర్టుగా ముద్ర వేశారు. ఇప్పుడు అవే ప్రశ్నలు వేసిన గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ పైనా బీజేపీతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి పార్టీని ఎవరూ కాపాడలేరు'' అని శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. ఇక..

కాంగ్రెస్ లో అంతర్గత పరిణామాలపై స్పందిస్తూ బీజేపీ నేత ఉమా భారతి మరింత ఘాటైన కామెంట్లు చేశారు. ''గాంధీ-నెహ్రూ కుటుంబ మనుగడ సంక్షోబంలో పడింది. రాజకీయంగా వాళ్ల ఆధిపత్యం ముగిసింది. తద్వారా కాంగ్రెస్ పని ఫినిష్ అయింది. ఇప్పుడు వాళ్ల మాటలకు విలువ లేదు. ఒకవేళ తిరిగి నిలబడాలనుకుంటే, కాంగ్రెస్ తన విదేశీ మూలాలను పూర్తిగా తెంచేసుకుని, స్వదేశీగా మారాలి''అని ఉమా భారతి అభిప్రాయపడ్డారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications