బీఎస్పీ ఎంపీపై అనుచిత వ్యాఖ్యల ఎఫెక్ట్: ఎంపీ రమేష్ బిధూరీకి బీజేపీ నోటీసులు
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ కున్వర్ డానిష్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన క్రమంలో.. లోక్సభ ఎంపీ రమేష్ బిధూరి(Ramesh Bidhuri)కి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. అంతకుముందు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.. ఈ ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీని హెచ్చరించారు.
లోక్సభలో భారత చంద్రుని మిషన్ చంద్రయాన్-3 విజయంపై చర్చ సందర్భంగా ఎంపీ డానిష్ అలీపై బిధూరి అనుచిత, మతపరమైన వ్యాఖ్యలను ఉపయోగించారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. సభ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. కాగా, రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలను రికార్డ్ నుంచి తొలగించారు.

డానిష్ అలీ గురించి బిధూరీ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని, ఇలాంటి పదజాలం ఇంతకుముందెన్నడూ వినలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. పార్లమెంట్ కొత్త భవనం ఇలాంటి మాటలతో ప్రారంభం కావడం బాధాకరమన్నారు. బిధూరీ వ్యాఖ్యలు బీజేపీ ఉద్దేశాన్ని తెలియజేస్తోందని ఆరోపించారు. బిధూరీపై కఠిన చర్యలు తీసుకోవాలని జైరాం రమేష్ డిమాండ్ చేశారు. ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా బిధూరీ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
కాగా, ఎంపీ బిధూరీ వ్యాఖ్యల పట్ల లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి. ఈ వ్యాఖ్యల పట్ల రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. మరోవైపు, తనపై చేసిన వ్యాఖ్యలను ప్రివిలేజ్ కమిటీ పరిశీలనకు పంపాలని కోరుతూ లోక్సభ స్పీకర్కు డానిష్ అలీ లేఖ రాశారు. బిధూరీపై చర్యలు తీసుకోకుంటూ తాను సభ్యత్వాన్ని వదులుకునే ఆలోచన కూడా చేస్తానని అన్నారు.
మరోవైపు, నోటీసులు జారీ చేసిన బీజేపీ.. సమాధానం ఇవ్వడానికి దక్షిణ ఢిల్లీ ఎంపీ బిధూరీకి 15 రోజుల సమయం ఇచ్చింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications