ఆర్ టీఐ ఎఫెక్ట్, కోట్ల భూమి కబ్జాతో డీల్, హత్యకు సుపారి, ఐటీ హబ్ లో బీజేపీ లీడర్ అందర్ !
కర్ణాటకలో ఆర్ టీఐ కార్యకర్తలకు ఏమాత్రం కొదవలేదు. ఐటీ హబ్ బెంగళూరులో కూడా చాలా మంది ఆర్ టీఐ కార్యకర్తలు ఉన్నారు. సీఎంలు, మాజీ సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేల అక్రమాస్తుల గురించి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించిన కొందరు ఆర్ టీఐ కార్యకర్తలు చివరికి వారి మీద కోర్టుల్లో కేసులు వేసి హైలెట్ అయ్యారు. కొందరు మాత్రం ఆర్ టీఐ కార్యకర్తల ముసుగులో సెటిల్ మెంట్లు చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
బెంగళూరులో నివాసం ఉంటున్న నాగరాజ్ అనే వ్యక్తి ఆర్ టీఐ కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్టీఐ కార్యకర్త నాగరాజ్ బెంగళూరులోని కుంబాలగూడ నివాసం ఉంటున్నాడు. కెంగేరి అండర్ పాస్ సమీపంలో బైక్పై వెళ్తుండగా దుండగులు అతనిపై మారణాయుధాలతో దాడి చేసి హత్య చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే తప్పించుకుని ఆసుపత్రిలో చేరిన ఆర్ టీఐ కార్యకర్త నాగరాజ్ ప్రాణాలు కాపాడుకున్నాడు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరులోని కెంగేరి పోలీసులు కేసు నమోదు చేసి బీజేపీ నేత గోవిందరాజు, మనీష్, మోహన్, పూజారి, బెంగళూరు రౌడీషీటర్ కృష్ణ, వేణుగోపాల్, సతీష్, శశికుమార్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. కుంబాలగూడ పంచాయతీలో 1. 5 ఎకరాల భూమిని బీజేపీ నాయకుడు గోవిందరాజు కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆర్ టీఐ కార్యకర్త నాగరాజ్ కు ఈ విషయం తెలిసింది.
ఆ భూమి గురించి సమాచారం ఇవ్వాలని ఆర్ టీఐ కార్యకర్త నాగరాజ్ ఆర్టీఐ ద్వారా భూమి వివరాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గోవిందరాజు ఆర్ టీఐ కార్యకర్త నాగరాజ్ కు ఫోన్ చేసి సెటిల్ మెంట్ కు రావాలని, ఇద్దరూ కుర్చుని మాట్లాడుకుందామని చెప్పాడని తెలిసింది. కానీ ఆర్ టీఐ కార్యకర్త నాగరాజ్ సెటిల్ మెంట్ కు అంగీకరించలేదని, గోవింరాజు దగ్గరకు వెళ్లలేదని తెలిసింది.
ఇదంతా జరిగిన తర్వాత చంద్ర లేఅవుట్ లో నివాసం ఉంటున్న రౌడీషీటర్ కృష్ణకు ఐదు లక్షలు ఇచ్చిన బీజేపీ నాయకుడు గోవిందరాజు ఆర్ టీఐ కార్యకర్త నాగరాజ్ ను హత్య చెయ్యడానికి డీల్ మాట్లాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. నాగరాజ్ హత్య కోసం రూ. 50 వేలు అడ్వాన్స్ కూడా రౌడీషీటర్ కృష్ణకు ఇచ్చారని పోలీసులు అంటున్నారు. మూడు, నాలుగు రోజులుగా నాగరాజ్ ను హత్య చెయ్యడానికి నిందితులు ప్రయత్నించారని తెలిసింది.

అయితే చివరిగా నాగరాజ్ బైక్ పై వెళుతుండగా కెంగేరి రైల్వే అండర్ పాస్ దగ్గర దాడికి పాల్పడి అతన్ని హత్య చెయ్యడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. కెంగేరి పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఆర్ టీఐ కార్యకర్త హత్య కోసం బీజేపీ నాయకుడు రౌడీషీటర్ కు కిరాయి ఇచ్చి అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications