బెంగళూరులో బీజేపీ భోణి, చక్రం తిప్పుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సినిమా, మల్లేశ్వరంలో డాక్టర్ !
బెంగళూరు: బెంగళూరు నగరంలో బీజేపీ భోణి మొదలైయ్యింది. బెంగళూరు నగరంలోని మల్లేశ్వరం శాసన సభ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సీఎన్, అశ్వథ్ నారాయణ ఘనవిజయం సాధించారు. నిత్యం ప్రజలతో టచ్ లో ఉంటున్న డాక్టర్ అశ్వథ్ నారాయణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఘనవిజయం సాధించారు.
గత రెండు శాసన సభ ఎన్నికల్లో డాక్టర్ అశ్వథ్ నారాయణ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మల్లేశ్వరంలో డాక్టర్ అశ్వథ్ నారాయణ అనేక అభివృద్దిపనులు చేశారు. ప్రతిరోజు మల్లేశ్వరంలో పలు వీదుల్లో సంచరిస్తూ స్థానికుల కష్టసుఖాలు అడిగి తెలుసుకునే డాక్టర్ అశ్వథ్ నారాయణ మల్లేశ్వరంలో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెంగల్ శ్రీపాదరేణును సులభంగా ఓడించిన డాక్టర్ అశ్వథ్ నారాయణ మల్లేశ్వరంలో మరోసారి తన పట్టునిరూపించుకున్నారు. జేడీఎస్ పార్టీ అభ్యర్థి ఎన్. మధుసూదన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. మొత్తం మీద బెంగళూరులో బీజేపీ మల్లేశ్వరం నుంచి తనపట్టు నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.