సపోజ్ పర్ సపోజ్ అదే జరిగితే మా దగ్గర ప్లాన్ బి రెఢీగా ఉంది, బీజేపీ లీడర్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. మే 13వ తేదీన ఉదయం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలుకానుంది. అయితే మాకు సంపూర్ణ మెజారిటీ రాకపోతే మేము ఏం చెయ్యాలో మాకు తెలుసని, మా దగ్గర ప్లాన్ బీ రెఢీగా ఉందని బీజేపీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిపోవడంతో సుమారు 100 మంది నాయకులు గెలుపు ధీమాతో రిల్యాక్స్ గా ఉన్నారు. మిగిలిన నాయకులు ఎవరు గెలుస్తారో తెలీక అయోమయంలో టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల జాతకాలు తారుమారు అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

దాదాపు అన్ని సర్వేలు ఈసారి అధిక సీట్లతో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పాయి. అయితే ఏ పార్టీ కూడా పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని పలు సర్వేలు చెప్పాయి. తాము 141 సీట్లలో విజయం సాధిస్తామి కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్, 130 సీట్లలో విజయం సాధిస్తామని మాజీ సీఎం సిద్దరామయ్య ధీమాగా చెబుతున్నారు.
కర్ణాటక సీనియర్ మంత్రి, బీజేపీ నాయకుడు ఆర్. అశోక్ మేము కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నమ్మడంలేదని, 2018లో విడుదల అయిన సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తారుమారు అయ్యాయని మంత్రి అశోక్ గుర్తు చేశారు.

ఇంతకాలం వచ్చిన సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయిన తరువాత తారుమారు అవుతాయని బీజేపీ సీనియర్ నాయకుడు అశోక్ జోస్యం చెప్పారు. ఒకవేళ బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాలేపోయినా మేము ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి మా దగ్గర ప్లాన్ బి రెఢీగా ఉందని మంత్రి అశోక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరులోని పధ్మనాభనగర్ తో పాటు కనకపురలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ మీద ఆర్. అశోక్ పోటీ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చెయ్యకుండా చూస్తూ కర్చోవడానికి మేము రాజకీయ సన్యాసులు కాదని, ఎవరి స్కెచ్ లు వాళ్ల దగ్గర ఉంటాయని, మా దగ్గర ప్లాన్ బి రెఢీగా ఉందని ఆయన మీడియా ముందు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు స్ట్రాంగ్ రూమ్ ల్లోని ఈవీఎంల్లో భద్రంగా ఉన్నాయి. మే 13వ తేదీన ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయిన తరువాత అందరి బండారం బయటకు వచ్చేస్తుంది. అయితే ఇప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో స్కెచ్ లు వేసుకుంటున్నారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications