సుప్రీంకోర్టుకు చేరిన బీజేపీ రథయాత్ర..!
కోల్కతా : వెస్ట్ బెంగాల్ లో తలపెట్టిన రథయాత్రకు అనుమతివ్వాల్సిందిగా సుప్రీంకోర్టు మెట్లెక్కారు బీజేపీ నేతలు. కోల్కతా హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదివరకే బీజేపీ రథయాత్రకు అనుమతిస్తూ ఏకసభ్య ధర్మాసనం నిర్ణయం వెల్లడించింది. అయితే ఆ తీర్పును హైకోర్టు డివిజనల్ బెంచ్ పక్కన పెట్టింది. ఈక్రమంలో బీజేపీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లారు.
2019 సాధారణ ఎన్నికలకు వ్యూహం రూపొందిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. 42 లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాలని తలపెట్టారు. అయితే కోల్కతా హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశాలతో ఆటంకమేర్పడింది. బీజేపీ రథయాత్రతో తమకు ఇబ్బందులు ఎదురవుతాయనే భావనతో తృణమూల్ కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్.

మొత్తానికి బీజేపీ రథయాత్ర కథ సుప్రీంకోర్టుకు చేరడంతో అనుకూల ఫలితమే వస్తుందని ఆశిస్తున్నారు ఆ పార్టీశ్రేణులు. ఈనేపథ్యంలో మరోసారి షెడ్యూల్ మార్చిన అమిత్ షా.. ఈనెల 28 నుంచి 31 వరకు వెస్ట్ బెంగాల్ లో రథయాత్ర నిర్వహించే ఛాన్సుంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications