దమ్ముంటే ప్రధాని మోదీని ప్రశ్నించండి, దుమ్ము దులుపేసిన సీఎం, కూలి పని చేశారా ?
కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సాయం కోరేందుకు ఢిల్లీ వెళ్లిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ నుంచి బెంగళూరుకు విలాసవంతమైన చార్టర్డ్ విమానంలో వచ్చారు. కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ సిద్ధరామయ్యతో కలిసి విమాన ప్రయాణం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మంత్రి జమీర్ అహ్మద్ ట్విటర్లో ఓ వీడియోను షేర్ చేయడంతో రాష్ట్ర బీజేపీ నేతలు సీఎం సిద్ధరామయ్యను టార్గెట్ చేశారు.
కర్ణాటక రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా విలాసవంతమైన విమానంలో వెళ్లి సీఎం సిద్దరామయ్య ఆనందిస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ కూడా సిద్ధరామయ్యపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. ఇదే విషయమై పలువురు మీడియా ప్రతినిధులు సీఎం సిద్ధరామయ్యను ప్రశ్నించగా ప్రధాని నరేంద్ర మోదీ ఏ విమానాల్లో తిరుగుతారు అని ప్రశ్నించారు.

ఇదే ప్రశ్నను ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి అడగాలని, తనను ప్రశ్నించిన వారికి తాను చెబుతున్నానని బీజేపీ నాయకులకు సీఎం సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలకు నైతికత లేదని సీఎం సిద్ధరామయ్య బీజేపీ నేతల విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ కమల ద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసిన చరిత్ర బీజేపీ నాయకులకు ఉందని సిద్దరామయ్య విమర్శించారు.
ఆపరేషన్ కమల కోసం వందల కోట్ల రూపాయల డబ్బులు ఎవరు ఇచ్చారని, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ, ముంబాయి చుట్టు తిప్పడానికి విమానం ఎవరు ఇచ్చారని, వారాల తరబడి విలాసవంతమైన హోటళ్లలో బస చేసి సరదాగా గడిపిన ఎమ్మెల్యేల కోసం డబ్బులు ఎవరు ఖర్చు చేశారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు.
బీజేపీ నాయకులు కూలీ పనులు చేసి ఆపరేషన్ కమల కోసం ఖర్చు చేశారా ? అని సిద్దరామయ్య నిలదీశారు. కర్ణాటక రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించేందుకు నేను ప్రత్యేక విమానంలో వెళ్లడంపై అభ్యంతరం చెప్పే నైతికత కర్ణాటక రాష్ట్ర బీజేపీ నేతలకు ఉందా?, వాళ్లు సక్రమంగా ఉన్నారా అని సీఎం సిద్దరామయ్య విరుచుకుపడ్డారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications