గుజరాత్ బీజేపీ మేనిఫెస్టో: 20 లక్షల ఉద్యోగాలు, ఉమ్మడి పౌరస్మృతి, ఉచిత విద్య
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది అధికార బీజేపీ. కేజీ టూ పీజీ ఉచిత విద్య, ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి హామీలను అందులో పేర్కొంది. గాంధీనగర్లో బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్తో పాటు రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ భూపేంద్ర పాటిల్ ఈ మేనిఫెస్టోను శనివారం విడుదల చేశారు.
ప్రజల వద్ద నుంచి సేకరించిన సలహాలు, సూచనలు దృష్టిలో ఉంచుకుని ఈ మేనిఫెస్టోను తయారు చేశామన్నారు బీజేపీ నేతలు. వివిధ జిల్లాల్లో మంత్రులతో పాటు యువమోర్చా ద్వారా పలు కార్యక్రమాల ద్వారా సలహాలు సేకరించినట్లు తెలిపారు. సుమారు 12 వేల సూచనల బాక్సులు, మిస్డ్ కాల్స్ పోల్, వెబ్సైట్ పోల్, వాట్సాప్ పోల్ల సమాహారమే ఈ 'సంకల్ప పత్రం' అని జేపీ నడ్డా వెల్లడించారు.

ఉగ్రముప్పు నుంచి రాష్ట్రానికి భద్రత కల్పించేలా యాంటీ-రాడికలైజేషన్ యూనిట్ ఏర్పాటు, రెండు ఎయిమ్స్ సహా కొత్త ఆస్పత్రుల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ వంటి హామీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించింది.
బీజేపీ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు:
రూ. 10 వేల కోట్లతో రాష్ట్రంలోని 20 వేల ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి
విద్యార్థినులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
ఉమ్మడి పౌరస్మృతి అమలు, వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగావకాశాలు
వచ్చే ఐదేళ్లలో మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు
రూ. 10వేల కోట్లతో రైతులకు మౌలిక సదుపాయాల కల్పన
మహిళలు, వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణాలు
ఆయుష్మాన్ భారత్ కింద వార్షిక బీమా మొత్తం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలు పెంపు.
గుజరాత్ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు సమానంగా తీర్చిదిద్దడం.
సంఘ విద్రోహకులు ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం చేకూరిస్తే వారిపై చర్యలు తీసుకునేలా చేస్తాం.
ఉగ్రవాదులతో పాటు స్లీపర్ సెల్స్ను నిర్మూలించేందుకు యాంటీ రాడికలైజేషన్ సెల్ను స్థాపిస్తాం.
కాగా, 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications