వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడలికి మళ్లీ పెళ్లి చేసి, రూ.100 కోట్లిచ్చిన బీజేపీ ఎంపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజ్‌కోట్: పోరుబందర్ బీజేపీ పార్లమెంటు సభ్యుడు విఠల్ రాడాడియా రూ.100 కోట్ల ఆస్తిని మరో పెళ్లి చేసుకుంటున్న ఆమె కోడలికి ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. విఠల్ రాడాడియా బీజేపీ పార్లమెంటు సభ్యుడు. అలాగే రైతు నాయకుడు. సమాచారం మేరకు... విఠల్ తనయుడు కల్పేష్ రాడాడియా కార్డియాక్ సమస్య కారణంగా ఏడు నెలల క్రితం మృతి చెందాడు.

కల్పేష్ తన భార్య మనీషా, ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవాడు. కల్పేష్ మృతి నేపథ్యంలో విఠల్ తన కోడలు మనీషాను మరో పెళ్లి చేయాలని భావించాడు. తద్వారా ఆమెకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు.

BJP MP gifts property worth Rs 100cr for daughter-in-law's remarriage

కోడలు మనీషా పెళ్లి ఎంపీ విఠల్ కొడుకు స్నేహితుడితో రాజ్ కోట్ జిల్లాలోని జంకందోర్నా పట్టణంలో శుక్రవారం జరగనుంది. అయితే, ఎంపీ విఠల్ ఆమెకు కేవలం పెళ్లి చేయడంతోనే ఆగిపోలేదు. తన కోడలుకు పెళ్లి జరిపిస్తున్న ఆయన కన్యాదానం కింద ఆమెకు రూ.100 కోట్ల మేర ప్రాపర్టీని ఇస్తున్నారట.

మనీషాను పెళ్లి చేసుకుంటున్న వ్యక్తి పేరు హార్దిక్ చౌటియా. ఇతను సూరత్‌లో ఉంటుంటాడు. ఇతను ఎంపీ విఠల్ మరో కొడుకుతో పాటు కలిసి పని చేస్తున్నాడు. విఠల్ రాడాడియా మరో తనయుడు జయేష్ రాడాడియా జెత్పూర్ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అతను గుజరాత్ పర్యాటక శాఖ మంత్రి.

English summary

 Porbandar BJP MP and Leuva Patel leader Vitthal Radadiya has given a property worth Rs 100 crore to his daughter-in-law on Friday to get her remarried.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X