మాజీ సీఎంకు లక్కీ చాన్స్, అక్కడి నుంచి పోటీ, గెలిస్తే అక్కడ కూడా పదవి ఇస్తామని హామీ !
బెంగళూరు/హావేరి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకుని ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కనీసం 20 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపించాలని బీజేపీ సిద్దం అవుతోంది. బీజేపీ హైకమాండ్ కూడా గెలిచే నేతలను రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. హవేరి నియోజకవర్గం నుంచి మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని రంగంలోకి దింపుతున్నారని తెలిసింది.
2024 లోక్సభ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. కొత్త అభ్యర్థి కోసం అన్వేషణలో ఉన్న బీజేపీ నాయకత్వం సిట్టింగ్ ఎంపీ శివకుమార్ స్థానంలో హావేరి లోక్సభ నియోజకవర్గం నుండి మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ని పోటీకి దింపాలని ఆలోచిస్తోందని తెలిసింది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని బీజేపీ సిట్టింగ్ ఎంపీ శివకుమార్ ఉదాసి చెప్పారు.

ఇప్పటికీ శింగ్లావి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బసవరాజ్ బోమ్మయ్ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శింగ్గావి నియోజకవర్గం ధారవాడ లోక్సభ నియోజకవర్గానికి చెందినప్పటికీ, హవేరి జిల్లాలో మాజీ సీఎంకు గణనీయమైన ప్రభావం ఉంది. అంతేకాకుండా బసవరాజ్ బోమ్మయ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హవేరీ జిల్లా అభివృద్ధికి చేసిన పనులను గమనించిన బీజేపీ హైకమాండ్ లోక్ సభ ఎన్నికల్లో బసవరాజ్ బోమ్మయ్ ని అక్కడి నుంచి గెలిపించాలని పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు.
బీజేపీకి సవాల్గా మారిన హవేరీ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి గదగ్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు కూడా రానున్నాయి. ఎందుకంటే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గదగ్ జిల్లాలోని 7 నియోజక వర్గాల్లో బీజేపీ రెండు జిల్లాల్లో ఘోరంగా ఓడిపోయింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శింగ్లావిలో సీఎం బసవరాజ్ బోమ్మయ్ మాత్రమే విజయం సాధించారు, మిగిలిన ఆరు నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత ఐదు నియోజక వర్గాల్లో మేమ పట్టుసాధించామని కాంగ్రెస్లో ఆత్మవిశ్వాసం నెలకొంది. హావేరి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ గెలవడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ధారవాడ డివిజన్ కు చెందిన సీనియర్ నాయుకుడు ఒకరు మాట్లాడుతూ హావేరిలో బీజేపీకి ఎదురైన సవాల్ గురించి మాకు తెలుసు, హావేరీకి అర్హులైన అభ్యర్థిని ప్రకటిస్తామని అంటున్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్షనేత ఎన్నిక జాప్యంపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే బీజేపీపై పలు విమర్శలు గుప్పించడంతో బీజేపీ జాతీయ సంస్థ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్ గురువారం బెంగళూరులో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికలు. ఈ సమయంలో శాసనసభలో ప్రతిపక్ష నేత నియామకంలో జాప్యంపై కూడా చర్చ జరిగింది. దీంతోపాటు బసవరాజ్ బోమ్మయ్ పాత్రపైనా చర్చ జరిగింది. మొత్తం మీద ఇప్పటి నుంచే బీజేపీ నాయకులు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై లోతుగా ఆలోచిస్తోందని తెలిసింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications