వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిసి పాటిల్‌‌ను ప్రలోభాలకు గురి చేయలేదు: బిజెపి ఇంఛార్జీ మురళీధర్ రావు

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బిసి పాటిల్ ను ప్రలోభాలకు గురిచేసినట్టు వచ్చిన వార్తలపై బిజెపి నేత కర్ణాటక ఇంచార్జీ మురళీధర్ రావు ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాటిల్ తో తాను ఫోన్లో మాట్లాడి ప్రలోభాలకు గురిచేసినట్టు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బిసి పాటిల్ తో శ్రీరాములు, బిజెపి ఇంచార్జీ మురళీధర్ రావు మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ ఆడియో క్లిప్ లను విడుదల చేసింది. ఈ విషయమై బిజెపి కర్ణాటక ఇంఛార్జీ మురళీధర్ రావు తీవ్రంగా ఖండించారు.

BJPs Muralidhar Rao denies offering money to Congress MLA BC Patil

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఆడియో క్లిప్ చేసింది. బిసి పాటిల్ తో యడ్యూరప్ప కూడ పోన్లో చర్చించినట్టుగా ఆడియో క్లిప్ ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో బిజెపి నేతలు ప్రలోభాలకు గురిచేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా ఆడియో క్లిప్ లను విడుదల చేశారు.

ఈ ఆడియో సంభాషణలు బయటకు రావడం బిజెపి ఏ రకంగా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిందో అర్ధమౌతోందని కాంగ్రెస్ నేతలు బిజెపిపై విమర్శలు గుప్పించారు. అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపికి లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు.

English summary
Muralidhar Rao, BJP state in-charge, denied having spoken to the BC Patil, the Congress MLA of Hirekerur. Audio clips of him and Sriramulu offering money and posts to Patil over the phone have emerged though its authenticity couldn't be verified.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X