ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ఢమాల్.. స్పష్టమైన ఆధిక్యంలో బీజేపీ
ఉత్తరాఖండ్ లో 44 స్థానాల్లో ఆధిక్యంతో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 22 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఉత్తరాఖండ్ లో స్పష్టమైన ఆధిక్యంలో బీజేపీ ముందంజలో ఉంది. 70 అసెంబ్లీ నియోజక వర్గాలున్న ఉత్తరాఖండ్ లో బీజేపీ 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 22 స్థానాల్లో కాంగ్రెస్ ద్వితీయ స్థానానికి పడిపోయింది.
ఇక్కడ ఇతరులు కేవలం 4 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తరాఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 36. ఈ నేపథ్యంలో ఒకటి రెండు గంటల్లోనే పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.
ప్రస్తుతం భారీ ఆధిక్యంలో ఉన్న బీజేపీ అప్పుడే సంబరాలకు సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రస్తుత సీఎం హరీష్ రావత్ వెనుకంజలో ఉండగా, కమలనాథులు తమదే గెలుపు అంటూ విజయఢంకా మోగిస్తున్నారు.
ఇండియా టుడే-యాక్సిస్ అండ్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం దాదాపు 53 సీట్లతో ఉత్తరాఖండ్ లో బీజేపీ పాగా వేస్తుంది. ప్రస్తుతం బీజేపీ హవా చూస్తుంటే.. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమైనట్లే చెప్పుకోవాలి.