బెంగళూరులో ఫ్లైఓవర్ ఎక్కుతున్న సిటీ బస్సు పల్టీ, 8 మంది పరిస్థితి విషమం, 23 మందికి గాయాలు !
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం ఆద్వర్యంలో బెంగళూరు నగరంలో సంచరిస్తున్న బీఎంటీసీ బస్సు ఫ్లైఓవర్ ఎక్కుతున్న సమయంలో అదుపుతప్పి పల్టీకొట్టడంతో 23 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలైనాయి. వారిలో 8 మంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
బుధవారం బెంగళూరు నగరంలోని రాజాజీనగర్ 1వ బ్లాక్ లో వెలుతున్న బీఎంటీసీ బస్సు ఫ్లైఓవర్ ఎక్కుతున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి సర్వీసు రోడ్డులోకి పల్టీ కొట్టింది. ఆ సందర్బంలో బీఎంటీసీ బస్సులో ఉన్న ప్రయాణికులు ఒకరి మీద ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది.

విషయం గుర్తించిన స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు బీఎంటీసీ బస్సులో ఉన్న ప్రయాణికులను బయటకు లాగడానికి ప్రయత్నించారు. అతి కష్టం మీద బస్సులో ఉన్న 23 మందిని బయటకు లాగారు. 23 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
గాయపడిన వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బెంగళూరు నగరంలో నిత్యం బీఎంటీసీ బస్సులు ప్రమాదాలకు గురికావడంతో వాటిలో సంచరించడానికి ప్రయాణికులు హడలిపోతున్నారు.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications