ఘోర ప్రమాదం: యమునా నదిలో పడవ మునగడంతో 20 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాందా జిల్లాలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. యమునా నదిలో పడవ మునిగిపోవడంతో.. 20 మంది మరణించారు. ఇప్పటి వరకు పలువురి మృతదేహాలను బయటికి తీశారు. కొంతరు ఈతకొట్టుకుంటూ ఒడ్డుకుచేరడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
మరికొంతమంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు జరుగుతోంది. మర్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 50 మంది ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మర్కా నుంచి ఫతేపుర్లో ఉన్న జరౌలీ ఘాట్ కు యమున నది మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బలమైన గాలులతో సుడిగుండం ఏర్పడి.. పడవ మునిగిపోయిందని తెలుస్తోంది.
ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న అధికారులు, గజ ఈతగాళ్లు, ఇతర సిబ్బంది సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications