ఘోర ప్రమాదం: యమునా నదిలో పడవ మునగడంతో 20 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాందా జిల్లాలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. యమునా నదిలో పడవ మునిగిపోవడంతో.. 20 మంది మరణించారు. ఇప్పటి వరకు పలువురి మృతదేహాలను బయటికి తీశారు. కొంతరు ఈతకొట్టుకుంటూ ఒడ్డుకుచేరడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
మరికొంతమంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు జరుగుతోంది. మర్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 50 మంది ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మర్కా నుంచి ఫతేపుర్లో ఉన్న జరౌలీ ఘాట్ కు యమున నది మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బలమైన గాలులతో సుడిగుండం ఏర్పడి.. పడవ మునిగిపోయిందని తెలుస్తోంది.
ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న అధికారులు, గజ ఈతగాళ్లు, ఇతర సిబ్బంది సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications