వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే అంబులెన్స్‌లో 22 మృతదేహాలు -కరోనా విలయంలో మరో ఘోరం -వాహనాల్లేవు, ఏం చేయమంటారు?

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా ఉధృతి పెరుగుతున్నకొద్దీ హృదయ విదారక దృశ్యాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. కొవిడ్ మృతులకు కనీస మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహించాలన్న కోర్టుల ఆదేశాలు దాదాపు ఎక్కడా అమలు కావడంలేదు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోనైతే పరిస్థితి ఇంకాస్త దిగజారింది. అధికారుల నిర్లక్ష్యం, వ్యవస్థ వైఫల్యాన్ని కళ్లకు కట్టే ఘటన తాజాగా చోటుచేసుకుంది..

Recommended Video

CoWin, Aarogya Setu and Umang app will be open for vaccine registrations | Oneindia Telugu

బీజేపీ ఎంపీ చేతిలో 10వేల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు -కోర్టు విస్మయం -మోదీ సర్కారుకు నోటీసులు -అరెస్టు తప్పదా?బీజేపీ ఎంపీ చేతిలో 10వేల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు -కోర్టు విస్మయం -మోదీ సర్కారుకు నోటీసులు -అరెస్టు తప్పదా?

కరోనాతో మరణించిన 22 మంది మృతదేహాలను ఒకే అంబులెన్స్‌లో తరలించడం విమర్శలకు దారి తీసింది. సరైన వైద్య పరమైన రవాణా సదుపాయాలు లేనందునే ఇలా చేయాల్సి వచ్చిందని జిల్లా అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో కొవిడ్‌తో చనిపోయిన 22 మంది మృతదేహాలను ఒకే అంబులెన్సులో తరలించారు.

Bodies of 22 COVID-19 victims stuffed in one ambulance in Maharashtra, public outrage

బీడ్‌ జిల్లాలోని స్వామీ రామానంద్‌తీర్థ్‌ గ్రామీణ ప్రభుత్వ వైద్య కళాశాల మార్చురీలో ఉంచిన మృతదేహాలను దహన సంస్కారాల కోసం ఆదివారం ఇలా రవాణా చేశారు. ఆస్పత్రిలో అంబులెన్సులు తగినన్ని లేనందున కరోనా రోగులను తరలించే వాహనంలోనే 22 మృతదేహాలను ఒకేసారి శ్మశానాలకు తరలించారు. ఈ ఘటన తాలూకు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా,

Bodies of 22 COVID-19 victims stuffed in one ambulance in Maharashtra, public outrage

ఒకే అంబులెన్స్ లో అన్నేసి మృతదేహాలను తరలించడంపై వైద్య కళాశాల డీన్ డాక్టర్ శివాజీ సుక్రే స్పందించారు. ఆస్పత్రిలో తగినన్ని అంబులెన్సులు లేనందునే ఇలా జరిగిందన్నారు. గత ఏడాది తొలి దశ కరోనా వ్యాప్తి సమయంలో తమ వద్ద ఐదు అంబులెన్సులు ఉండేవని.. అందులో మూడింటిని ఆస్పత్రి నుంచి ఉపసంహరించడంతో కొవిడ్‌ బాధితులను తరలిస్తున్నట్లు వివరించారు. మరో మూడు అంబులెన్సులను మంజూరు చేయాలని జిల్లా అధికారులకు మార్చి 17న లేఖ రాసినట్లు చెప్పారు.

జగన్ బెయిల్ రద్దు: సీఎం, సీబీఐకి భారీ షాక్ -ఎంపీ రఘురామ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు -నోటీసులుజగన్ బెయిల్ రద్దు: సీఎం, సీబీఐకి భారీ షాక్ -ఎంపీ రఘురామ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు -నోటీసులు

English summary
The bodies of 22 COVID-19 victims were stuffed in one ambulance while being taken to a crematorium at Beed in Maharashtra, with the district administration citing lack of medical transport vehicles as the reason for it. The incident took place on Sunday when the bodies, kept in the mortuary of the Swami Ramanand Teerth Rural Government Medical College at Ambajogai in Beed, were being transported for the last rites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X