వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: ట్రైన్‌లో లేడీస్ టాయిలెట్‌లో ఉరేసుకున్నాడు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కాన్పూర్: రైలులో మహిళా టాయిలెట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉంచార్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. ప్రభుత్వ రైల్వే పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ సోమవారం అర్ధరాత్రి రైల్లోని టాయిలెట్‌‌ని ఉపయోగించేందుకు యత్నించగా టాయిలెట్ లోపల నుండి లాక్ వేసి ఉండటం గమనించింది.

 Body found hanging inside train's toilet in UP

అయినా సరే టాయి‌లెట్ డోర్‌ను పలు మార్లు కొట్టగా ఎంతసేపటకీ తలుపు తీయకపోగా, సమాధానం చెప్పకపోవడంతో రైల్వే పోలీసుకు సమాచారం అందించడం జరిగింది. వెంటనే పోలీసులు స్పందించి టాయిలెట్ డోర్‌ను తెరవగా గుడ్డ ముక్కుతో టాయిలెట్‌తో ఉరివేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

మృతదేహం వద్ద ఉన్న గుర్తింపు కార్డుని బట్టి బీహార్‌కు చెందిన శ్యామ్ లాల్‌గా మృతదేహన్ని గుర్తించారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్ లాల్‌‌ది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో దర్యాప్తుని ప్రారంభించామని తెలిపారు.

English summary
Body of a 30-year-old man was found hanging inside a ladies coach's toilet in the Unchahar Express, a Government Railway Police (GRP) official said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X