కశ్మీర్ స్కూల్ లో పేలుడు 17 మందికి గాయాలు
శ్రీనగర్ : పేలుళ్లతో కశ్మీర్ మరోసారి దద్దరిల్లింది. పుల్వామ జిల్లాలోని ఓ పాఠశాలలో పేలుడు జరిగింది. నర్బల్ గ్రామంలోని కాకపోర ప్రాంతంలోని పాఠశాలలో పేలుడు సంభవించింది. ఆ సమయంలో పదో తరగతి విద్యార్థులు శీతకాల ట్యూషన్ కోసం వచ్చి పాఠశాలలోనే ఉన్నారు. మిగతా విద్యార్థులు ఇంటికెళ్లిపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గినట్టైంది.
17 మందికి గాయాలు ..
మధ్యాహ్న సమయంలో పేలుడు జరిగింది. అక్కడే ఉన్న దాదాపు 17 మంది విద్యార్థులకు గాయాలైనట్టు తెలుస్తోంది. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ విద్యార్థుల పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని .. ఈ పేలుడుకు గల కారణాల కోసం అన్వేషిస్తున్నారు.

వారిలో కొందరికీ అప్పటికే గాయాలు ..
పేలుడులో గాయపడ్డ విద్యార్థుల్లో కొందరు ఇప్పటికే గాయపడ్డ విద్యార్థులు ఉన్నారు. ఈ విషయాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వాహకులు నిర్ధారించారు. వారిలో ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం శ్రీనగర్ తరలించినట్టు పేర్కొన్నారు. మిగతా విద్యార్థులు పుల్వమా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications