బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్ కిడ్నాప్: రూ. 20 లక్షల డిమాండ్
జమాయి: బీహార్ రాష్ట్రంలో కిడ్నాపర్లు రెచ్చిపోయారు. ఏకంగా ఓ జాతీయ బ్యాంకు మేనేజర్ తోపాటు అకౌంటెంట్ను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన జమాయి జిల్లాలో చోటు చేసుకుంది. వారిని విడిచిపెట్టాలంటే రూ. 20 లక్షలు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఆ అధికారులు కిడ్నాప్కు గురయ్యారు. అయితే సదరు అధికారుల కుటుంబసభ్యులు మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

కిడ్నాపర్ల బెదిరింపుల కారణంగా వారి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయలేదని పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న ఆ ఇద్దరు అధికారులను రాజ్ల కెనరా బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ఓం ప్రకాశ్ పాశ్వాన్, రంజిత్ కుమార్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పాశ్వాన్కు సంబంధించిన ద్విచక్ర వాహనాన్ని శాటిఘాట్ ప్రాంతంలో గుర్తించినట్లు చెప్పారు.
అయితే కిడ్నాప్ చేసింది మావోయిస్టులా లేక నేరస్తులా అనేది తేలాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కిడ్నాప్ చేసిన దుండగులను పట్టుకునేందుకు ఇప్పటికే తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. అతి త్వరలో నిందితులను పట్టుకుని, అధికారులను క్షేమంగా తీసుకొస్తామని చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications