అడుగు దూరంలో ఆగిన బీజేపీ.. బెంగళూరుకు అమిత్ షా.. ఎంపీలతో మోదీ భేటి!
కర్ణాటక అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి బీజేపీ ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. విధానసభలో అత్యధిక స్థానాలున్న పార్టీగా బీజేపీ అవతరించనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీని సొంతం చేసుకోలేకపోయింది. తాజా సమాచారం ప్రకారం.. 222 సీట్లకు లెక్కింపు జరుగగా.. కాంగ్రెస్కు 78, బీజేపీ 104, జేడీఎస్ 38, ఇండిపెండెంట్లు 2 స్థానాలు లభించాయి.
బెంగళూరులో క్షణక్షణానికి మారుతున్న పరిస్థితులపై బీజేపీ దృష్టిపెట్టింది. సీనియర్ నేతలతో బీజేపీ చీఫ్ అమిత్ షా భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యేందుకు మంగళవారం అర్ధరాత్రి బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు.

ఇదిలా ఉండగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా సమీక్ష నిర్వహించనున్నారు మంగళవారం సాయంత్రం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోవడంతో బీజేపీ శ్రేణులు అసంతృప్తికి లోనయ్యారు. దేశరాజధానితోపాటు అన్ని చోట్ల వేడుకలను నిలిపివేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications