పుతిన్ను పట్టించుకోకుండా మోదీతోనే..! ఫోటోల కోసం పోటీ పడ్డ డెలిగేట్స్: Viral Video
న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ (BRICS) బిజినెస్ ఫోరమ్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతర్జాతీయ నాయకులు, వ్యాపారవేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులతో నిండిపోయిన ఆ ప్రాంగణంలో మోదీ క్రేజ్ స్పష్టంగా కనిపించింది. దౌత్యపరమైన చర్చలు, సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే వాతావరణంలో ఒక్కసారిగా సరదా ఘట్టం చోటు చేసుకుంది. వివిధ దేశాల నుంచి వచ్చిన డెలిగేట్స్ ప్రధాని మోదీతో ఫోటోలు దిగేందుకు విపరీతంగా పోటీ పడ్డారు.
బిజినెస్ ఫోరమ్ ప్రాంగణంలో ప్రధాని మోదీ ఉన్న సమయంలో పలువురు విదేశీ ప్రతినిధులు ఆయన వద్దకు వచ్చారు. "సార్.. మీతో ఒక ఫోటో దిగొచ్చా?" అని ఎంతో ఆసక్తిగా అడిగారు. దానికి ప్రధాని మోదీ కూడా ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ "ఖచ్చితంగా, రండి" అని సమాధానమిచ్చారు. దీంతో మోదీ చుట్టూ విదేశీ డెలిగేట్స్ అంతా ఒక్కసారిగా గుమిగూడారు. మోదీ గ్లోబల్ పాపులారిటీకి ఈ సన్నివేశం అద్దం పట్టింది.

దారి ఇచ్చిన పుతిన్, పెజెష్కియాన్!
ఈ అరుదైన దృశ్యం జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర పరిణామం కనిపించింది. డెలిగేట్స్ అంతా ప్రధాని మోదీ చుట్టూ గుమిగూడుతుండటంతో.. అక్కడే ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ లతో పాటు ఇతర కీలక నేతలు వారికి దారి ఇస్తూ పక్కకు తప్పుకున్నారు. విదేశీ ప్రతినిధులకు మోదీతో ఫోటో దిగేందుకు వీలుగా వారు స్పందించిన తీరు సదస్సులో ప్రత్యేకంగా నిలిచింది.
VIDEO | Prime Minister Narendra Modi was requested by a group of young participants at the BRICS Summit venue for a group photograph, and he obliged.
— Press Trust of India (@PTI_News) September 11, 2026
(Source: Third Party) pic.twitter.com/oKlsYlzzFi
సభలో సరదా నవ్వులు!
ఫోటో కోసం అంతా సర్దుకుంటున్న సమయంలో ప్రధాని మోదీ వారిని కాసేపు ఆగమని చెప్పారు. ఆ గుంపులో ఉన్న మహిళా ప్రతినిధులను ఉద్దేశించి "మీరు నిజంగా గ్రేట్.. మీ టీమ్లో ఇంతమంది మహిళలు ఉన్నారు" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దానికి ఆ ప్రతినిధులు నవ్వుతూ "మాకే చాలా సంతోషంగా ఉంది సార్" అని బదులిచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు వికసించాయి. అనంతరం అందరితో కలసి ప్రధాని ఫోటోలకు పోజులిచ్చారు.
బిజీ బిజీగా మోదీ షెడ్యూల్
సదస్సులో ఒకవైపు సరదా వాతావరణం కనిపిస్తున్నప్పటికీ.. ప్రధాని మోదీ షెడ్యూల్ మాత్రం అత్యంత బిజీగా గడిచింది. బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్లో కీలక ప్రసంగం చేసిన ఆయన, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్లతో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వాణిజ్య సంబంధాల పెంపుపై ఈ భేటీల్లో సుదీర్ఘంగా చర్చించారు.














Click it and Unblock the Notifications
