మణిపూర్ లో భారీ స్థాయిలో ఓటింగ్.. ప్రజల అమితాసక్తి
మణిపూర్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరుగుతోంది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకే 69 శాతం ఓటింగ్ నమోదైంది.
న్యూఢిల్లీ: మణిపూర్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరుగుతోంది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకే 69 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రజలు కూడా ఓటు వేసేందుకు అమితోత్సాహం చూపిస్తున్నారు.
ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. ఉదయం 11 గంటలకల్లా 43 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రానికి భారీ ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఈ రోజు తొలి దశలో 38 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మణిపూర్ ఉక్కుమహిళ, పీఆర్జేఏ అధ్యక్షురాలు ఇరోమ్ షర్మిల 20 ఏళ్ల తరువాత మళ్లీ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఈరోజు ఉత్తరప్రదేశ్ లో ఆరో దశ పోలింగ్ జరుగుతోంది. మణిపూర్ తో పోల్చితే యూపీలో తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతోంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు మరొక్క దశతో ముగుస్తాయి. మార్చి 11న వీటితోపాటు ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications