మోడీ తరహలోనే యడ్యూరప్ప: విధానసభ వద్ద భావోద్వేగం, ప్రమాణం
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విధానసౌధకు గురువారం నాడు వచ్చారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప భావోద్వేడానికి గురయ్యారు. విధానసౌధ మెట్లను చేతులతో తాకి ప్రమాణం చేశారు. 2014లో పార్లమెంట్లోకి నరేంద్ర మోడీ ఏ తరహలో వెళ్ళారో అదే తరహలో యడ్యూరప్ప కూడ విధాన సభలోకి అడుగుపెట్టారు.
2014లో జరిగిన ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం సాధించింది. ఈ విజయం తర్వాత ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా పార్లమెంట్లోకి అడుగుపెట్టే సమయంలో నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యారు.

పార్లమెంట్ మెట్లను తాకి ప్రమాణం చేశారు.మోడీ తరహలోనే కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడ విధాన సభ మెట్లను తాకి భావోద్వేగానికి గురయ్యారు. ఈ మెట్లను తాకి ప్రమాణం చేశారు.
యడ్యూరప్ప కర్ణాటక రాష్ట్రానికి మూడో దఫా ముఖ్యమంత్రిగా గురువారంనాడు బాధ్యతలను స్వీకరించారు. అయితే ఈ దఫా కనీస మెజార్టీకి 8 మంది ఎమ్మెల్యేల దూరంలో బిజెపి ఉండిపోయింది. ఈ తరుణంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప 15 రోజుల్లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications