మానవసేవే మాధవసేవ: బీఎస్ఎఫ్ దళాలపై ప్రశంసలు కురిపిస్తోన్న అమరనాథ్ యాత్రికులు..!!
అమర్నాథ్ యాత్రలో వేలాది మంది యాత్రికులకు సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) సహాయం చేస్తోంది. వైద్య సహాయం నుండి రక్షణ కార్యకలాపాల వరకు, యాత్రికులందరూ సురక్షితంగా ఉండేలా బిఎస్ఎఫ్ బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి.
ఈ సంవత్సరం యాత్ర జూలై 3న ప్రారంభమైంది. ఇప్పటికే సుమారు 1.75 లక్షల మంది పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించారు. ఈ మార్గం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. నిటారుగా ఉండే కొండలు, అత్యంత శీతల వాతావరణం చాలా మంది యాత్రికులకు తల తిరగడం, అలసట లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తున్నాయి. అయితే, బిఎస్ఎఫ్ మాత్రం యాత్రికులకు సహాయం చేస్తూ చికిత్స అందిస్తూ సహకారం అందిస్తోంది.

బిఎస్ఎఫ్ నుండి త్వరిత వైద్య సహాయం
బిఎస్ఎఫ్ రెండు ప్రధాన మార్గాలైన పహల్గామ్ ,బాల్టాల్ మార్గాల్లో రక్షణ, వైద్య బృందాలను నియమించింది. ఈ బృందాలకు అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి శిక్షణ ఇచ్చారు. ఆక్సిజన్ సిలిండర్లు, ప్రథమ చికిత్స కిట్లతో పాటు ఇతర వైద్య సామాగ్రిని తీసుకువెళుతున్నారు. ఈ విధంగా యాత్రికుల ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తున్నారు.
ఈ విషయం గురించి బిఎస్ఎఫ్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, ''ప్రతి యాత్రికుడికి సహాయం చేయడానికి మేము 24/7 అందుబాటులో ఉంటాము. వారి భద్రత మా ప్రధాన లక్ష్యం’’ అని అన్నారు.
బిఎస్ఎఫ్ యొక్క ఈ ముఖ్యమైన పని కారణంగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోన్న చాలా మందికి అక్కడికక్కడే ఆక్సిజన్ సపోర్ట్ లభిస్తోంది. ఇంకా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు.
తీర్థయాత్ర మార్గాన్ని శుభ్రంగా ఉంచడానికి కూడా బిఎస్ఎఫ్ చాలా సహాయం చేస్తోంది. గ్రామీణ పారిశుద్ధ్య డైరెక్టరేట్తో కలిసి, వ్యర్థాలను నిర్వహించడానికి , పరిశుభ్రతను కాపాడటానికి మొబైల్ టాయిలెట్లు, చెత్త కుండీలను ఏర్పాటు చేసింది.
బిఎస్ఎఫ్ సహాయానికి ధన్యవాదాలు తెలిపిన యాత్రికులు
బిఎస్ఎఫ్ తలపెట్టిన ఈ ప్రయత్నానికి యాత్రికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన యాత్రికురాలు సునీతా దేవి మాట్లాడుతూ, "ఈ యాత్ర చాలా కష్టంగా ఉంది. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నట్లు నేను చూశాను. కానీ, బిఎస్ఎఫ్ బృందం వారికి చికిత్స అందించడానికి చాలా కష్టపడుతోంది. ఇది దేవుని పని" అని అన్నారు.
మహారాష్ట్రకు చెందిన మరో యాత్రికుడు రాజేష్ మెహతా మాట్లాడుతూ, "నేను చాలా యాత్రలు చేశాను. కానీ ఇంత మంచి వైద్య మరియు రక్షణ సహాయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. బిఎస్ఎఫ్ దారి పొడవునా మమ్మల్ని సురక్షితంగా చూసుకుంది" అని అన్నారు.
ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ యాత్ర సజావుగా సాగుతోంది. కాశ్మీర్ లోయలో కొద్దిగా వర్షం కురిసినప్పటికీ, యాత్రకు ఎటువంటి ఆటంకం కలగలేదు. దీనికి కారణం బిఎస్ఎఫ్ సిబ్బంది. వారి కృషి వలన వేలాది మంది యాత్రికులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా పూర్తి చేయగలుగుతున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications