నేను ఏడవను, నా కొడుకు చెప్పాడు: అమర జవాన్ తల్లి
ఢిల్లీ: పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన జవాన్ గుర్నమ్ సింగ్ శనివారం రాత్రి అమరుడయ్యారు. చికిత్స పొందుతున్న గుర్నంను మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్కు తరలించాలని చూస్తుండగా దురదృష్టవశాత్తు చనిపోయారని ఓ అధికారి తెలిపారు.
కాగా, దేశాన్ని రక్షించే క్రమంలో తన కుమారుడు ప్రాణాలు కోల్పోయినందుకు బాసినందుకు గర్వంగా ఉందని గుర్నమ్ సింగ్ తల్లి జశ్వంత్ కౌర్ అన్నారు. తన కొడుకు తనకు చెప్పాడని, ఒకవేళ తాను చనిపోతే దయచేసి ఎవరూ బాధపడవద్దన్నాడని, అందుకే నేను ఏడవటం లేదని ఆ తల్లి చెప్పారు.

దేశాన్ని రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లను చూసి నేను ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. గాయపడిన తన కుమారుడుని బక్షి నగర్ ఆసుపత్రిలో చేర్పించారని, బీఎస్ఎఫ్కు సొంతంగా ఆసుపత్రి ఉంటే తన కొడుకును కాపాడగలిగేవారని గుర్నమ్ సింగ్ తండ్రి గుల్బీర్ సింగ్ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నానని.. మన దేశ జవాన్ల కోసం ఒక మంచి ఆసుపత్రి ఉంటే బాగుటుందని గుర్నమ్ సింగ్ తండ్రి గుల్బీర్ సింగ్ అన్నారు. కాగా, జమ్ము కాశ్మీర్లోని హిరానగర్ సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతూ గుర్నమ్ మృతి చెందారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications