కొల్లేగల్లో చరిత్ర సృష్టించిన బీఎస్పీ అభ్యర్థి మహేష్, బీజేపీ, కాంగ్రెస్కు షాక్
బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీ జనతా పార్టీ ఎగ్జిట్ పోల్స్ను తలకిందులు చేస్తూ విజయాన్ని నమోదు చేస్తుండగా.. బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ) కొల్లేగల్లో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.
లైవ్: కర్ణాటక ఫలితాలు: స్పష్టమైన మెజార్టీ దిశగా బీజేపీ, యడ్యూరప్ప విజయం, సిద్ధరామయ్య ఓటమి
కొల్లేగల్ నుంచి పోటీ చేసిన ఎన్ మహేష్.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి 10,213ఓట్లతో ఘన విజయం సాధించారు. కొల్లేగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కృష్ణమూర్తి, బీజేపీ అభ్యర్థిగా నంజుండస్వామి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
ఇది ఇలా ఉండగా, కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీ దిశగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ వెనకబడింది. అయితే, జేడీఎస్ కూడా గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఎక్కువగానే సాధించేలా కనిపిస్తోంది. మంగళవారం సాయంత్రం వరకు పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.