దేశ ప్రజల సగటు ఆదాయం ఏకంగా సగం పెరిగిందట
Budget 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ-ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. అందులో పొందుపరిచిన అంశాలను చదివి వినిపించారు.
Recommended Video

10 సంవత్సరాల కాలంలో దేశ ప్రజల సగటు ఆదాయం ఏకంగా 50 శాతం మేర పెరిగిందని నిర్మల సీతారామన్ అన్నారు. ఈ పదేళ్ల కాలంలో 25 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి కల్పించామని నిర్మల సీతారామన్ చెప్పారు. పేదల సంక్షేమమే దేశ సంక్షేమంగా అభివర్ణించారామె.

ప్రతి నెలా పెరుగుతూ వస్తోన్న వస్తు-సేవా పన్నుల వసూళ్లే సగటు ఆదాయం వృద్ధి చెందిందనడానికి నిదర్శనమని నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అయిదో ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందనే విషయాన్ని ఈ లెక్కలు స్పష్టం చేస్తోన్నాయని పేర్కొన్నారు.
వచ్చే అయిదు సంవత్సరాల కాలంలో దీన్ని మరింత పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగా గ్రామీణ స్థాయిలో అభివృద్ధి ఫలాలను చేర్చనున్నామని, దీనితోపాటు- దేశవ్యాప్తంగా అనేక గిరిజన గ్రామాలు, ఆదివాసీల ఆవాసాలకు మౌలిక సదుపాయాలను కల్పించామని, వాటన్నింటికీ 4జీ నెట్వర్క్ను కల్పించామని ఆమె అన్నారు.
ప్రజల సగటు ఆదాయాన్ని మరింత పెంచడానికి వచ్చే అయిదేళ్ల కాలంలో అనేక చర్యలను చేపట్టబోతోన్నామని నిర్మల సీతారామన్ వివరించారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ అందించామని, దీనివల్ల ఉపాధి అవకాశాలను మెరుగుపర్చగలిగామని నిర్మల సీతారామన్ చెప్పారు. అలాగే 54 లక్షలమంది యువత నైపుణ్యాన్ని మరింత పెంచగలిగామని పేర్కొన్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications