Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిన్న పరిశ్రమలకు పెద్దపీట: ఎంఎస్‌ఎంఈలకు నిర్మలమ్మ 'మహా' ప్యాకేజీ!

Budget 2026: దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) కోసం కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. చిన్న వ్యాపారాలకు పెట్టుబడి కొరత లేకుండా చూడటం, పాత పారిశ్రామిక క్లస్టర్లకు పునర్జీవం పోయడమే లక్ష్యంగా భారీ నిధులను కేటాయించారు.

పెట్టుబడి కష్టాలకు చెక్
దేశంలో చిన్న పరిశ్రమలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పెట్టుబడి. దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం రూ. 10,000 కోట్లతో 'ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్'ను ఏర్పాటు చేసింది. ఈ నిధి ద్వారా అద్భుతమైన వృద్ధి సామర్థ్యం ఉన్న చిన్న సంస్థలకు ఈక్విటీ రూపంలో మద్దతు లభిస్తుంది. కేవలం లోన్లు ఇవ్వడమే కాకుండా, ఆ సంస్థలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా ఈ నిధి తోడ్పడుతుంది. ముఖ్యంగా ఎగుమతులు, ఉత్పాదకతపై దృష్టి పెట్టే సంస్థలకు ఇందులో ప్రాధాన్యత ఉంటుంది.

Budget 2026 Rs 10 000 Cr Growth Fund for MSMEs 200 Industry Clusters to be Revived FM Updates

అతి చిన్న పరిశ్రమలకు భరోసా: రూ. 2,000 కోట్ల అదనపు సాయం
దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ పరిశ్రమలు (Micro Enterprises) తరచుగా నగదు కొరతను ఎదుర్కొంటుంటాయి. వీటిని ఆదుకోవడానికి ఇప్పటికే ఉన్న 'సెల్ఫ్ రిలయంట్ ఇండియా (SRI) ఫండ్'కు రూ. 2,000 కోట్ల అదనపు నిధులను కేటాయించారు. క్రెడిట్ గ్యారంటీ పథకాలు ఉన్నప్పటికీ.. బ్యాంకుల నుంచి రుణాలు పొందని అతి చిన్న యూనిట్లకు ఈ నిధి నేరుగా ఊపిరి పోయనుంది.

పాత క్లస్టర్లకు పునర్జీవం.. 200 లెగసీ క్లస్టర్ల ఆధునీకరణ
ఇండియాలో సాంప్రదాయకంగా వస్తున్న అనేక పారిశ్రామిక క్లస్టర్లు (ఉదాహరణకు: చేనేత, తోలు, కంచు పరిశ్రమలు) నేడు ఆధునిక సాంకేతికత లేక కునారిల్లుతున్నాయి. అటువంటి 200 పాత పారిశ్రామిక క్లస్టర్లను పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. దీనివల్ల పాతబడిపోయిన యంత్రాల స్థానంలో కొత్త టెక్నాలజీ రావడమే కాకుండా, స్థానికంగా లక్షలాది మందికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

రుణాల సరళీకరణ.. డిజిటల్ విప్లవం
ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే క్రెడిట్ గ్యారంటీ కవర్‌ను రూ. 10 కోట్ల వరకు పెంచారు. అంతేకాకుండా, సూక్ష్మ పరిశ్రమల కోసం ప్రత్యేక 'ముద్రా క్రెడిట్ కార్డ్స్'ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా చిన్న వ్యాపారులు తమ అవసరాలకు అనుగుణంగా తక్కువ వడ్డీకే తక్షణ రుణాలు పొందే వెసులుబాటు కలుగుతుంది. సిడ్బీ (SIDBI) ద్వారా డిజిటల్ లెండింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల రుణాలు పొందే సమయం గణనీయంగా తగ్గుతుంది.

చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకత
చిన్న వ్యాపారులు ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య చెల్లింపుల జాప్యం. దీనిని అరికట్టడానికి గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్ (GeM), ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (TReDS)లను ఒకదానితో ఒకటి అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వ శాఖల నుంచి ఎంఎస్‌ఎంఈలకు అందాల్సిన పేమెంట్స్ పారదర్శకంగా మరియు సకాలంలో అందుతాయి.

'మేక్ ఇన్ ఇండియా'కు కొత్త రెక్కలు
మొత్తంగా ఈ బడ్జెట్ ఎంఎస్‌ఎంఈ రంగాన్ని కేవలం 'బతికేలా' చేయడం కాకుండా, 'పోటీపడేలా' తీర్చిదిద్దింది. పాదరక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్ రంగాల్లోని చిన్న వ్యాపారులకు ఈ కేటాయింపులు కొండంత అండగా నిలువనున్నాయి. ఇది భారత్ ప్రపంచ తయారీ హబ్‌గా మారాలనే లక్ష్యానికి పునాది వేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+