థానేలో కూలిన భవనం: 9 మంది దుర్మరణం
థానే: మహారాష్ట్రలోని థానే నగరంలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. భవన శిథిలాల కింద మరో 15 మంది చిక్కుకున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. శిథిలాలను తొలగించేందుకు స్థానికులు రంగంలోకి దిగారు.
థానే పాతనగరంలోని నౌపడ ప్రాంతంలో గల బి కేబిన్లోని మంగళవారం తెల్లవారు జామున గం.2.45 నిమిషాల ప్రాంతంలో భవనం కూలింది. భవనం ప్రమాదకరంగా మారిందని, ఎవరూ ఉండకూడదని గతంలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా అందులో కొంత మంది ఉంటూ వచ్చారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ సంజీవ్ జైశ్వాల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ యంత్రాలతో సహాయక బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందం శునకాలతో, తగిన పరికరాలతో భవనం చెంతకు చేరుకుంది.
More From
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications