బస్సు-బోలెరో ఢీ.. 13 మంది మృతి.. పదుల సంఖ్యలో గాయాలు
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, బోలెరో వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డవారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. బస్సు ప్రమాదంతో క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం రోదనలతో మిన్నంటింది.
రాజస్థాన్లోని డందానియా పోలీసుస్టేషన్ పరిధిలోని బలేసర్ మండలం జోధ్పూర్ వద్ద ప్రమాదం జరిగింది. 125వ జాతీయ రహదారి వద్ద బస్సు మహీంద్ర బోలెరోను ఢీ కొంది. బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని బలెసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో ఎనిమిది మందిని జోధ్పూర్కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. బస్సు ప్రమాద ఘటనలో అక్కడికక్కడే 13 మంది చనిపోయారు. వీరిలో ఏడుగురు పురుషులు కాగా ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నారు. బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు. బస్సు ప్రమాదంతో ఆ ప్రాంగణమంతా క్షతగాత్రుల రోదనలతో మిన్నంటింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications