ఓటమి ఎఫెక్ట్, ఈసీపై ఉద్ధవ్ థాకరే కొత్త డిమాండ్: కీలక కైరానాలో బీజేపీకి షాక్, ఓటమికి ఇదీ కారణం!
National
oi-Srinivas G
By Srinivas
న్యూఢిల్లీ: మూడు రోజుల క్రితం వివిధ రాష్ట్రాల్లో 4 లోకసభ స్థానాలకు, 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 4 లోకసభ సీట్లకు గాను బీజేపీ, మిత్రపక్షం రెండు సీట్లు గెలుచుంది. ఆరు పార్టీలు కలిసి ఆర్ఎల్డీ అభ్యర్థిగా తబస్సుంను బరిలోగి దింపగా.. విపక్షాల ఐక్యతతో యూపీలో కీలకమైన కైరానా స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. మహారాష్ట్రలో మరో స్థానాన్ని.. కమలంను ఎదుర్కొనేందుకు మేజర్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న ఎన్సీపీ-కాంగ్రెస్లకు కోల్పోయింది. ఇక్కడ ఎన్సీపీ అభ్యర్థి గెలిచారు.
ఆర్ఆర్ నగర్లో కాంగ్రెస్ గెలిచింది. మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా-గోండియా, నాగాలాండులోని సోలె, కైరానా లోకసభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. నూర్పూర్(యూపీ), షాకోట్(పంజాబ్), జోకిహట్(బీహార్), గోమియా&సిల్లి(జార్ఖండ్), చెంగన్నూర్(కేరళ), పాలస్ కడేగాన్(మహారాష్ట్ర), అపంతి(మేఘాలయ), తరలి(ఉత్తరాఖండ్), మహేస్తల(పశ్చిమ బెంగాల్)లలో ఉప ఎన్నికలు జరిగాయి.
May 31, 2018, 6:11 pm IST
బీజేపీపై విమర్శలు చేస్తున్నప్పటికీ ఉద్ధవ్ థాకరేను నమ్మలేమని, ఆయన మొదట ఎన్డీయే నుంచి బయటకు వస్తేనే ప్రజలు నమ్ముతారని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ అన్నారు.
Uddhav Thackeray is right, but no one will believe him till the time he is supporting the BJP. He should quit the alliance & everyone will believe what he says: Praful Patel, NCP on Uddhav Thackeray's remarks agaisnt BJP. pic.twitter.com/o3TX2dKmug
బీజేపీకి మిత్రపక్షాలు అవసరం లేదని, పాల్ఘర్లో తిరిగి రీకౌంటింగ్ జరపాలని ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల ఫలితాన్ని ప్రకటించవద్దని, అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారు.
If needed, we will go to court. But, whatever I have said about our democracy, election process & threat to it, was very serious: Uddhav Thackeray, Shiv Sena chief on #PalgharBypollspic.twitter.com/u3X0seyxuW
ఫల్ఘర్ ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసిన శివసేన మళ్లీ ఓట్లు లెక్కించాలని డిమాండ్ చేస్తోంది. 23, 24వ రౌండ్ నుంచి ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేసింది.
May 31, 2018, 4:52 pm IST
ఉప ఎన్నికల్లో బీజేపీ పెద్దగా రాణించకపోవడంపై ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ.. ఒక పెద్ద అడుగు వేసేందుకు రెండు అడుగులు వెనక్కి వేయాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తులో మేం చాలా పెద్ద అడుగు వేస్తామని చెప్పారు. తద్వారా 2019లో తిరిగి బీజేపీ గెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
జేడీయు - బీజేపీలు డబ్బు వెదలజల్లాయని అయినప్పటికీ గెలవలేకపోయాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చెప్పారు. పెట్రో ధరలు పెరుగుతున్నాయని, దీనిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, అందుకే తాము ఓడిపోయామని జేడీయూ నేత త్యాగి అన్నారు.
They used all their money & all their power, but could not get a victory. Nitish ji ne Ram Navmi ke dauraan jo 2 lakh talwaarein baantne ka kaam kiya tha, janta ne aaj ussi ke liye Nitish ji ko puruskaar dene ka kaam kiya hai: Tejashwi Yadav, RJD on #BypollResults2018pic.twitter.com/L0A5ep2xS9
ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, లెఫ్ట్, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుతో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుం కైరానాలో గెలుపొందారు. దీనిపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. తమకు ఓటు వేసిన ప్రజలకు శుభాకాంక్షలు అన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారు ఓడిపోయారన్నారు. బీజేపీకి ప్రజలు ఓటుతో మంచి సమాధానం చెప్పారన్నారు.
I want to congratulate all the people who voted for us. This is a defeat for those who do not believe in the democracy. People have given a befitting reply to the BJP: Akhilesh Yadav, Samajwadi Party President pic.twitter.com/RrBM0JCXqX
మేఘాలయలోని అంపతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మియాని డి షిరా గెలుపొందడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
Congress workers celebrate after declaration of Ampati bypoll results. Miani D Shira, daughter former CM and Congress leader Mukul Sangma has won the seat. pic.twitter.com/PgS6v9AudS
మహారాష్ట్రలోని బాంద్రా - గోండియా లోకసభ స్థానంలో కాంగ్రెస్ మద్దతిచ్చిన ఎన్సీపీ అభ్యర్థి గెలుపొందారు. దీంతో ఆ రెండు పార్టీల కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
Maharashtra: Congress and NCP workers celebrate in Bhandara after NCP wins from Bhandara-Gondiya bypoll Lok Sabha constituency pic.twitter.com/QLEi3CfPhw
బీజేపీకి చాలామంది ఓట్లు వేశారని, అయినప్పటికీ ప్రతిపక్ష అభ్యర్థి గెలిచారని, గెలిచిన అభ్యర్థి తబస్సుంకు తాను అభినందనలు తెలుపుతున్నానని, బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, సీపీఎంలతో కూడిన అలయెన్స్ తమపై గెలుపొందిందని, ఆ అలయెన్స్కు అనుగుణంగా తాము సమాయత్తమవుతామని కైరానా బీజేపీ అభ్యర్థఇ మృగాంకా సింగ్ అన్నారు.
Many voters did vote for BJP but with a lead of some thousand votes alliance has won. I would like to congratulate the candidate. The alliance has emerged strong and now we have to prepare better for future: Mriganka Singh, BJP Kairana candidate pic.twitter.com/yRbPc2g72Y
యూపీలోని కైరానా లోకసభ స్థానంలో బీజేపీ అభ్యర్థి మృగాంకా సింగ్పై ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుం గెలుపొందారు. ఆర్ఎల్డీకి కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం మద్దతిచ్చాయి. ఓ విధంగా ఆరు పార్టీలు కలిసి బీజేపీపై పోటీ చేశాయి.
May 31, 2018, 2:12 pm IST
కైరానా లోకసభ ఎన్నికల్లో విజయం దిశగా సాగుతున్న నేపథ్యంలో ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి మాట్లాడుతూ.. తమకు మద్దతిచ్చిన అఖిలేష్ యాదవ్, మాయావతి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీలకు థ్యాంక్స్ చెప్పారు.
Would like to thank all parties who supported us, thank Akhilesh ji, Mayawati ji, Rahul ji, Sonia ji, CPIM, AAP and others. Jinnah hara, Ganna jeeta: Jayant Chaudhary,RLD on RLD leading in Kairana LS bypoll pic.twitter.com/fULDwDHDCb
మాకు మద్దతునిచ్చిన ప్రతీ పార్టీకి ధన్యవాదాలు. అఖిలేశ్, మాయావతి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సీపీఎం, ఆమ్ ఆద్మీలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. జిన్నా ఓడాడు గన్నా గెలిచాడు: జయంత్ చౌదరి, ఆర్.ఎల్.డి
Would like to thank all parties who supported us, thank Akhilesh ji, Mayawati ji, Rahul ji, Sonia ji, CPIM, AAP and others. Jinnah hara, Ganna jeeta: Jayant Chaudhary,RLD on RLD leading in Kairana LS bypoll pic.twitter.com/fULDwDHDCb
10 అసెంబ్లీ, 4 లోకసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు, ఆర్ఆర్ నగర్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. దీంతో బీజేపీ ఎక్కువ స్థానాల్లో దెబ్బతిన్నది.
May 31, 2018, 1:35 pm IST
జార్ఖండ్ గోమియాలో జేఎంఎం గెలుపు - జార్ఖండ్ రాష్ట్రంలోని గోబియాలో జేఎంఎం అభ్యర్థఇ బబితా దేవి గోమియా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఆమె ఏజేఎస్యూ అభ్యర్థి లంబోదర్ మహతోపై విజయం సాధించారు.
May 31, 2018, 1:17 pm IST
కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మాట్లాడుతూ.. తమ పార్టీని ప్రజలు మరోసారి ఆశీర్వదించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బీజేపీ నాశనం చేయాలని చూస్తోందన్నారు.
May 31, 2018, 1:16 pm IST
జేడీయు పైన మా ఆధిక్యత ఎంత ఉందో అన్ని ఓట్లు కూడా వారికి రాలేదని తేజస్వి యాదవ్ అన్నారు.
May 31, 2018, 1:14 pm IST
ప్రత్యేక హోదా విషయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ మౌనం, ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా బీజేపీతో కలిసినందుకు జేడీయుకు ప్రజలు జోకిహాట్లో బుద్ధి చెప్పారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు.
The number of votes JDU got, is less than our victory margin. People of Bihar are continuing to avenge the uturn taken by Nitish Kumar: Tejashwi Yadav on RJD won Jokihat assembly bypoll #Biharpic.twitter.com/ljVXanHJ06
బీహార్ జోకిహాట్లో ఆర్జేడీ గెలుపు - బీహార్లోని జోకిహాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థి షాహన్వాజ్ గెలుపొందారు. ఇక్కడ నిన్నటి వరకు జేడీయూ అధికారంలో ఉంది. ఇక్కడ ఇప్పుడు ఆర్జేడీ 40వేల పై చిలుకు ఓట్లతో గెలిచింది.
May 31, 2018, 12:56 pm IST
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు - ఆర్ఆర్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న నాయుడు బీజేపీ అభ్యర్థిపై 41,162 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
May 31, 2018, 12:55 pm IST
ఫాల్ఘర్లో ఓటమిపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఈవీఎంలు సరిగా లేవని, 50 వేల నుంచి 60 వేల వరకు ఓటర్ల పేర్లు అదృశ్యమయ్యాయని, ఈసీ ఓటింగ్ పర్సెంటేజ్ను కూడా మార్చిందని ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నాయన్నారు.
Many EVMs were faulty, names of about 50-60,00 people were missing from voter list. Also, within 12 hours of voting ending, EC changed vote percentage. So all this is very doubtful: Sanjay Raut, Shiv Sena on BJP leading in Palghar bypoll pic.twitter.com/fk9tctgyZh
కేరళ చెంగనూరులో సీపీఎం గెలుపు - కేరళలోని చెంగనూర్లో సీపీఎం స్థానాన్ని నిలబెట్టుకుంది. 20,956 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై సీపీఎం సజీ చెరియన్ గెలిచారు. ఇక్కడ బీజేపీ మూడో స్థానంలో నిలిచింది.
May 31, 2018, 12:47 pm IST
మహారాష్ట్ర పాల్ఘర్లో బీజేపీ గెలుపు - పాల్ఘర్ లోకసభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి గవిట్ రాజేంద్ర శివసేన అభ్యర్థిపై 24వేల ఓట్ల తేడాతో గెలిచారు.
May 31, 2018, 12:46 pm IST
మేఘాలయ అంపతిలో గెలుపు - అంపతిలో కాంగ్రెస్ అభ్యర్థి మిలాని డీ షీరా గెలుపొందారు. దీంతో మేఘాలయలో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.
May 31, 2018, 12:45 pm IST
యూపీ నూర్పూర్లో గెలుపు - యూపీలోని నూర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. బీజేపీ నేత లోకేంద్ర సింగ్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ సమాజ్ వాది పార్టీ అభ్యర్థి నయీమ్ ఉల్ హసన్ గెలుపొందారు. విపక్షాల ఐక్యతతో బీజేపీ ఓడిపోయింది. 6,211 ఓట్లతో గెలిచారు.
May 31, 2018, 12:33 pm IST
ఆర్ఆర్ నగర్లో 14వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న నాయుడు 97,440 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి 56,278, జేడీఎస్ అభ్యర్థి 45,345 ఓట్లు సాధించారు.
May 31, 2018, 12:32 pm IST
నాగాలాండ్ లోకసభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ముందంజలో ఉంది. నాగా పీపుల్స్ ఫ్రంట్ కంటే 34వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది.
READ MORE
5:40 AM, 31 May
సోమవారం పలు రాష్ట్రాల్లోని 10 అసెంబ్లీ, 4 లోకసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడి కానున్నాయి. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
The counting of votes for by-elections to four Lok Sabha seats and 10 assembly constituencies will be held today
అందరి దృష్టి ప్రధానంగా ఉత్తర ప్రదేశ్లోని కైరానాపై ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలు రాజీనామా చేసిన లోకసభ స్థానాలను విపక్షాలు గెలుచుకున్నాయి. మరోవైపు ఇక్కడ మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ. దీంతో ఈ నియోజకవర్గం ఆసక్తిని కలిగిస్తోంది.
7:28 AM, 31 May
ఉప ఎన్నికలు జరిగిన నాలుగు లోకసభ స్థానాల్లో మూడు.. కైరానా, పాల్ఘర్, భండారా-గోండియా స్థానాలు బీజేపీ సిట్టింగ్ స్థానాలు. ప్రస్తుతం లోకసభలో బీజేపీ సంఖ్యాబలం స్పీకర్ కాకుండా 272. ఇది సరిగ్గా సాధారణ ఆధిక్యానికి అవసరమయిన బలం. ఇందులో ఒక్క స్థానం తగ్గినా విశ్వాస పరీక్షకు వెళ్లాల్సి వస్తే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పదు. ఈ 272 కూడా పార్టీలోని అసంతృప్తులు, ఇతరులు ఉన్నారు. ఒక ఎంపీ కీర్తి ఆజాద్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరొక ఎంపీ శతృఘ్న సిన్హా ఎప్పటి నుంచో తిరుగుబాటు గళం వినిపిస్తున్నారు. దీంతో బీజేపీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కనీసం సిట్టింగ్ స్థానాలైనా గెల్చుకోవడం అవసరంగా ఉంది.
7:30 AM, 31 May
బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తున్నప్పటికీ చాలా లోకసభ ఉపఎన్నికల్లో ఓటమి చవిచూస్తోంది. విపక్ష పార్టీలు ఒక్కటిగా పోటీ చేయడానికి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో లేదా వ్యూహాత్మక భాగస్వామ్యాలతో ఉప ఎన్నికల్లో గెలుస్తున్నాయి. ఇటీవల ఉప ఎన్నికలు నిర్వహించిన కైరానాలో బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ, కాంగ్రెస్ కలిశాయి. మహారాష్ట్రలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు ఎదురు నిలిచాయి. ఈ రాష్ట్రంలో పాల్ఘర్లో అయితే ఎన్డీఏ భాగస్వామ్యపక్షమయిన శివసేన కూడా అభ్యర్థిని నిలిపింది.
7:34 AM, 31 May
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ కోల్పోయిన సిట్టింగ్ స్థానాలు ఇవే.. బీడ్ (మధ్యప్రదేశ్-కాంగ్రెస్ గెలుపు), గురుదాస్పుర్ (పంజాబ్-కాంగ్రెస్ గెలుపు ), అల్వార్, అజ్మేర్ (రాజస్థాన్-కాంగ్రెస్ గెలుపు), గోరక్పుర్, ఫుల్పుర్ (ఉత్తర్ప్రదేశ్- ఎస్పీ మద్దతుతో బీఎస్పీ గెలుపు).
కాసేపట్లో అసెంబ్లీ, లోకసభ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పంజాబ్లోని షాకోట్ అసెంబ్లీ నియోజకవర్గం లెక్కింపు కేంద్రం వద్ద భద్రత.
#Punjab: Counting of votes for Shahkot Assembly constituency to start shortly, visuals from a counting centre. pic.twitter.com/y1afkKWBzA
రాజరాజేశ్వర నగర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్ గదిని తెరిచారు. జ్ఞానాక్షి నికేతన్ స్కూల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు. 550 వరకు పోస్టల్ ఓట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది.
8:30 AM, 31 May
నైపూ రియో రాజీనామాతో నాగాలాండ్లో ఉప ఎన్నిక జరిగింది. నైపు రియో నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికల ఎంతో కీలకం. నూర్పూర్, కైరానా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత.
Counting of votes for Noorpur Assembly constituency & Kairana Parliamentary constituency to start shortly, visuals from a counting centre in Kairana. #UttarPradeshpic.twitter.com/ZGPOjlsrv0
రాజరాజేశ్వరి నగర్ ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతున్న జ్ఞానాక్షి స్కూల్ పరిధిలో నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఒక డీసీపీ, 4 ఏసీపీలు, 10 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, ప్రత్యేక పోర్స్ను మోహరించారు.
8:32 AM, 31 May
కైరానాలో బీజేపీ అభ్యర్థి మృగాంకా సింగ్ కంటే కాంగ్రెస్-ఎస్పీ-బీఎస్పీ మద్దతుతో పోటీ చేసిన ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ఇప్పుడే ప్రారంభమైంది.
8:34 AM, 31 May
కైరానాలో 24 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. బాంద్రా -గోండియా, పాల్ఘర్లలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
8:37 AM, 31 May
యూపీలోని నూర్పూర్ అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థి అవని సింగ్ ముందంజలో ఉన్నారు. ఎస్పీ అభ్యర్థి నయీమ్ ఉల్ హసన్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ మృతితో ఉప ఎన్నిక జరుగుతోంది.
8:37 AM, 31 May
ఆర్ఆర్ నగర్లో అభ్యర్థి గెలవాలంటే 50,000 ఓట్లు రావాలి.
8:38 AM, 31 May
పాల్ఘర్లో శివసేన అభ్యర్థి శ్రీనివాస్ వాంగా ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గవిట్ వెనుకంజలో ఉన్నారు.
బీహార్లోని జోకిహాట్ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ 1200 ఓట్ల ఆధిక్యంలో ఉంది. పాల్ఘర్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. ఇందులో బీజేపీ కంటే శివసేన ముందంజలో ఉంది.
8:48 AM, 31 May
పంజాబ్లోని షాకోట్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి హర్వేద్ సింగ్ షిరోమణి అకాలీదళ్ అభ్యర్థి నయిబ్ సింగ్ కంటే ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి రతన్ కక్కర్ సింగ్ సత్తా చాటలేకపోతున్నారు. 14 నెలల క్రితం అకాలీదళ్ ఓడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సమయంలో అకాలీదళ్కు ఇక్కడ గెలుపు ఎంతో కీలకం.
8:49 AM, 31 May
యూపీలోని నూర్పూల్ అసెంబ్లీ స్థానంలో సమాజ్వాది పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
8:54 AM, 31 May
కేరళలోని చెంగనూర్లో సీపీఎం అభ్యర్థి సాజీ చెరియాన్ ముందంజలో ఉన్నారు. కేరళలో ప్రస్తుతం లెఫ్ట్ ప్రభుత్వం అధికారంలో ఉంది.
8:55 AM, 31 May
జార్ఖండ్లోని సిల్లి నియోజకవర్గంలో బీజేపీ ముందంజలో ఉంది. ఏజేఎస్యూ ప్రెసిడెంట్ సుదేశ్ మహతో, జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి సీమా మహతోలు వెనుకంజలో ఉన్నారు. మరోవైపు మహారాష్ట్రలోని బాంద్రాలో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
8:57 AM, 31 May
ఆర్ఆర్ నగర్లో తొలి రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ కంటే ముందంజలో ఉన్నారు. తొలి రౌండులో కాంగ్రెస్కు 9342 ఓట్లు, బీజేపీకి 5220 ఓట్లు వచ్చాయి. జేడీఎస్ మూడో స్థానంలో ఉంది.
8:59 AM, 31 May
పంజాబ్లోని షాకోట్ అసెంబ్లీ నియోజకవర్గంలో అకాలీదళ్ కంటే కాంగ్రెస్ అభ్యర్థి 2000 ఓట్ల ముందంజలో ఉన్నారు.
9:01 AM, 31 May
నూర్పూర్లో నయీమ్ ఉల్ హసన్ ముందంజలో ఉన్నారు. సమాజ్ వాది పార్టీ టిక్కెట్ పై పోటీ చేస్తున్నారు. 1264 ఓట్ల లీడింగ్లో ఉన్నారు. బెంగాల్లో మహేస్తాల నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి దులాల్ చంద్ర దాస్ ముందంజలో ఉన్నారు. బీహార్లోని జోకిహాట్లో లెక్కింపు జరుగుతున్న దృశ్యం
Bihar: Visuals from a counting centre in Jokihat, where counting has begun for assembly by-poll. pic.twitter.com/RaFvpYK1zW
జోకియాట్లో జేడీయూ ముందంజలో ఉంది. బెంగాల్లోని మహేస్తాలలో రెండు రౌండ్లు ముగిసేసరికి తృణమూల్ అభ్యర్థి దులాల్ చంద్ర దాస్ 10వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు.
9:09 AM, 31 May
రాజరాజేశ్వర నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 8,680 ఓట్ల ముందంజలో ఉన్నారు.
9:12 AM, 31 May
కేరళలోని చెంగనూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార సీపీఐ-ఎం ముందంజలో ఉంది.
9:16 AM, 31 May
కర్ణాటకలోని ఆర్ఆర్ నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న రెండో రౌండ్ ముగిసేసరికి 16581 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి మునిరాజు గౌడ 7901, జేడీఎస్ అభ్యర్థి రామచంద్ర 3606 ఓట్లు సాధించారు.
9:19 AM, 31 May
యూపీలోని నూపుర్ నియోజకవర్గంలో సమాజ్వాది పార్టీ అభ్యర్థి నైమూల్ హాసన్ 3,321 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు. కైరానాలో బీజేపీ అభ్యర్థఇ మృగాంకా సింగ్ ముందంజలోకి వచ్చారు.
9:25 AM, 31 May
పోస్టల్ బ్యాలెట్లో కైరానాలో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ 3000 ఓట్ల లీడింగులో ఉన్నారు.