మళ్లీ తెరపైకి సీఏఏ.. అప్పుడు అమలు, అమిత్ షా ఇండికేషన్
పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటన చేసింది. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అమలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. పార్లమెంట్ హౌస్లో తనను కలిసేందుకు వచ్చిన పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారికి ఈ మేరకు హామీ ఇచ్చారు.
బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి కాగానే దీనిని అమలు చేస్తామన్నారు. పౌరసత్వ సవరణల చట్టం 2019 డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి మత హింస తట్టుకోలేక 2014 డిసెంబర్ 31 నాటికి భారత్ చేరుకున్న ముస్లిమేతరులకు అంటే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం లభిస్తుంది.
ఈ చట్టం ప్రకారం ఏ భారతీయుడికీ పౌరసత్వం పోదని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఏఏకి వ్యతిరేకంగా గతంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. వద్దని కోరాయి. కానీ అవీ కుట్రతో ఆందోళనలు చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం విమర్శించింది. మళ్లీ ఇప్పుడు ఆ అంశం తెరపైకి వచ్చింది.

పాకిస్థాన్, బాంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ నుంచి భారత దేశానికి వలస వచ్చే ముస్లిమేతరలకు పౌరసత్వము ఇవ్వడానికి ఉద్దేసించినది. ఆయా దేశాలలో మతపరమైన దాడుల నుండి తప్పించుకోవడానికి దేశములోనికి వచ్చేవారికనేది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం.
పౌరసత్వ చట్టం ఇప్పటికి ఐదు సార్లు సవరించారు. 1986,1992,2003,2005 2015 వీటిలో మూడు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో, రెండూ సార్లు బీజేపీ ప్రభుత్వ హయాంలో సవరణలు జరిగాయి. అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరిస్తుంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications