పీవోకేలో దాడి నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ అత్యవసర భేటీ
ఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ పై భారత వాయుసేన మెరుపుదాడి చేశాక నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశీతంగా పరిశీలిస్తోంది. ఉదయం 3.30 బాలాకోట్ వద్ద జైషై మహ్మద్ శిబిరంపై మెరుపుదాడి చేసింది. ఈ పరిస్థితుల్లో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అంచనా వేస్తోంది.
మోదీ నివాసంలో క్యాబినెట్ కమిటీ భేటీ
ఢిల్లీలోని లోకమాన్య తిలక్ రోడ్డులోని ప్రధాని మోదీ నివాసంలో క్యాబినెట్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీకి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా మిగతా మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాడులకు సంబంధించిన వివరాలను జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ వివరించారు. దాడుల నేపథ్యంలో కాసేపట్లో సైనికాధారులు మీడియాకు వివరించే అవకాశం ఉంది.

ఎమర్జెన్సీ మీటింగ్
పీవోకోలో భారత వాయుసేన దాడులతో పాకిస్థాన్ కూడా అప్రమత్తమైంది. ఇస్లామాబాద్ లో అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఆదేశాలు జారీచేసినట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొన్నది.












Click it and Unblock the Notifications