కేబుల్ టీవీ యూజర్లకు తీపికబురు: రూ. 130కే 150 ఛానళ్లు!
న్యూఢిల్లీ: దసరా పర్వదినం ముందు కేబుల్ టీవీ యూజర్లకు పెద్ద తీపి కబురు అందించింది ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్(ఏఐడీసీఎఫ్). కేవలం నెలకు రూ. 130 చెల్లిస్తే చాలు 150 ఛానెళ్లు వీక్షించే అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధమైంది.
కేబుల్ టీవీ ప్రొవైడర్ల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో వినియోగదారులకు పండగ ముందు శుభవార్త అందింది. కేబుల్ టీవీ ప్రొవైడర్లు ప్రస్తుతం రూ. 130 నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు వసూలు చేస్తున్నారు.

కాగా, భారతదేశంలో 80శాతం కేబుల్ యూజర్లకు ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్(ఏఐడీసీఎఫ్) సేవలు అందిస్తోంది. హాత్ వే డిజిటల్, ఇన్ డిజిటల్, సిటీ నెట్వర్క్స్, జీటీపీఎల్ హాత్వే, ఫాస్ట్వే ట్రాన్స్మిషన్, డీఈఎన్ నెట్వర్క్స్, యూసీఎన్ కేబుల్, ఆర్టెల్ కమ్యూనికేషన్స్, ఐసీఎన్సీఎల్, ఏషియానెట్ డిజిటల్, కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ ఏఐడీసీఎఫ్ లో సభ్యులుగా ఉన్నాయి.
కాగా, తమ సభ్యులందరూ చర్చించుకుని రూ. 130 నెట్ వర్క్ కెపాసిటీ ఫీజుతో సబ్ స్క్రైబర్లకు 150 ఎస్డీ ఛానళ్లు ఇచ్చేందుకు నిర్ణయించారని ఏఐడీసీఎఫ్ అధ్యక్షుడు ఎస్ఎన్ శర్మ వెల్లడించారు. అయితే, ఈ నిర్ణయానికి ట్రాయ్ ఆమోదం ఉందా? లేదా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.
ఇది ఇలావుంటే, రూ. 130 తీసుకుని యూజర్లకు 100 ఛానెళ్లు ప్రొవైడ్ చేయాలని టెలికామ్ రెగ్యూలేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) షరతు విధించింది. ఇందులో ఫ్రీ టూ ఎయిర్ ఛానెళ్లతోపాటు పెయిడ్ ఛానళ్లు కూడా ఉంటాయి.
వినియోగదారులు రూ.130+జీఎస్టీ చెల్లిస్తే సరిపోతుంది.
ఒకవేళ 50ఛానళ్లు ఎక్కువ కావాలనుకుంటే రూ. 40 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఏఐడీసీఎఫ్ నిర్ణయానికి ట్రాయ్ అనుమతి ఉన్నట్లయితే.. ఇక వినియోగదారులు రూ. 130కే 150 ఛానళ్లు చూసే అవకాశం అందుబాటులోకి రానుంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications