G20 Summit: ఢిల్లీ నుంచి బయల్దేరిన కెనడా ప్రధాని ట్రూడో..
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన విమానంలో సాంకేతిక లోపం కారణంగా 36 గంటల పాటు భారత్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆయన ఎట్టకేలకు మంగళవారం కెనడాకు బయల్దేరారు. ట్రూడో, అతని ప్రతినిధి బృందం సెప్టెంబర్ 8న G20 సమ్మిట్కు వచ్చినప్పటి నుంచి ఢిల్లీలో చిక్కుకుపోయారు. వారు సెప్టెంబర్ 10న స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉండే. కానీ ట్రూడో ప్రయాణించే ఎయిర్బస్ విమానంలో ఏర్పడిన చిక్కు వల్ల ట్రూడో ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. సాంకేతిక సమస్య పరిష్కరమైందని, విమానం ఎగరడానికి అనుమతినిచ్చిందని కెనడా ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ప్రెస్ సెక్రటరీ మొహమ్మద్ హుస్సేన్ను తెలిపారు.
ట్రూడోను వీడ్కోలు పలికేందుకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమానాశ్రయానికి వెళ్లారు. G20 సమ్మిట్కు హాజరైనందుకు ట్రూడో ధన్యవాదాలు తెలిపారు. "పీఎం నరేంద్ర మోడీ జీ, ప్రభుత్వంలోని నా సహచరుల తరపున, నేను ఈ రోజు విమానాశ్రయానికి చేరుకున్నాను, G20 సమ్మిట్కు హాజరైనందుకు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు ధన్యవాదాలు తెలిపాను. ఆయన పరివారం స్వదేశానికి సురక్షితంగా తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నట్లు" మంత్రి X లో పోస్ట్ చేశారు.

ట్రూడోను తీసుకెళ్లేందుకు బయలుదేరిన కెనడా వైమానిక దళానికి చెందిన సిసి-150 పొలారిస్ విమానాన్ని లండన్కు మళ్లించారు. భారత్, కెనడా సంబంధాల మోడీ ట్రూడోతో చర్చించారు. ఖలిస్తానీ అంశాలకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని కోరారు. G20 సమ్మిట్ సందర్భంగా జరిగిన చర్చల సందర్భంగా, కెనడా గడ్డపై ఖలిస్థానీ ఎలిమెంట్స్ కొనసాగిస్తున్న కార్యకలాపాల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్రూడోతో తన ఆందోళనలను వ్యక్తం చేశారు.
"కెనడాలో తీవ్రవాద మూలకాల భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగించడంపై మా తీవ్ర ఆందోళనలను ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తం చేశారు. వారు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. భారతీయ దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపిస్తున్నారు, దౌత్య ప్రాంగణాలను దెబ్బతీస్తున్నారు. కెనడాలోని భారతీయ సమాజాన్ని, వారి ప్రార్థనా స్థలాలను బెదిరిస్తున్నారు " అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ట్రూడో జీ20 కోసం భారత్ కు వచ్చారు. కానీ శనివారం రాష్ట్రపతి ఇచ్చిన విందుకు ట్రూడో హాజరు కాలేదు. దీని గల కారణాలను కెనాడ పీఎంఓ వెల్లడించలేదు. G20 నాయకులు రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన కార్యక్రమంలో ట్రూడో కొంత ఇబ్బందికరంగా ఉన్నారు. ట్రూడో చేతిని పట్టుకోవడానికి ప్రధాని మోడీ ప్రయత్నించారు.. ట్రూడో సున్నితంగా తిరస్కరించారు. దీనిపై ఆయన్ను మీడియా ప్రశ్నించింది. మీరు ఇష్టమున్నది అనుకోవచ్చని చెప్పారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications