శ్రీదేవి మృతిపై విచారణకు పిటిషన్: తోసిపుచ్చిన సుప్రీంకోర్టు..
న్యూఢిల్లీ: శ్రీదేవి మరణంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. సునీల్ సింగ్ అనే ఫిలిం మేకర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ ను విచారణకు స్వీకరించబోమన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా.. శ్రీదేవి మరణంపై ఇదివరకే దుబాయ్, భారతీయ అధికారులు విచారించారని అన్నారు. కాబట్టి దీనిపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.

కాగా, శ్రీదేవి మరణించిన సమయంలో.. తాను కూడా దుబాయిలోనే ఉన్నట్టు పిటిషనర్ సునీల్ సింగ్ పేర్కొన్నారు. ఆ సమయంలో తాను ఫ్యామిలీతో కలిసి దుబాయి వెళ్లినట్టు చెప్పారు. శ్రీదేవి మృతి చెందిన హోటల్ సిబ్బందితో తాను మాట్లాడానని, అలాగే శ్రీదేవిని తరలించిన ఆసుపత్రి సిబ్బందితోనూ మాట్లాడానని, ఈ వ్యవహారం తనకు వివాదాస్పదంగా అనిపించిందని చెప్పుకొచ్చారు.
కాగా, ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు దుబాయి వెళ్లిన శ్రీదేవి(54).. ఫిబ్రవరి 24న హోటల్ గదిలోని బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications